Homeజాతీయ వార్తలుKarnataka Assembly Elections 2023: వంద మునుగోళ్లు, వెయ్యి హుజురాబాద్ లు: ఈ దక్షిణాది రాష్ట్రంలో...

Karnataka Assembly Elections 2023: వంద మునుగోళ్లు, వెయ్యి హుజురాబాద్ లు: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎన్నికలు చాలా కాస్ట్ లీ గురూ!

Karnataka Assembly Elections 2023: ప్రియాంక గాంధీ దోశలు వేస్తోంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నాడు. అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేదే లేదని చెప్తున్నాడు. మల్లికార్జున ఖర్గే మోదీ విష సర్పం లాంటివాడని ఆరోపిస్తున్నాడు.. ఇక చిన్న చితకా నేతలయితే కనీసం ఊపిరి కూడా తీసుకోవడం లేదు. అన్ని పార్టీలకు ఆ స్థాయిలో ముఖ్యమైపోయాయి కర్ణాటక ఎన్నికలు. ఇదంతా క్షేత్రస్థాయిలో ఒక ఎత్తు. కనిపించని మరో ఎత్తు రాజకీయ విశ్లేషకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఔరా అని నోరు వెళ్లబెట్టేలా చేస్తోంది.

డబ్బు ప్రధానం.. డబ్బే ప్రధానం

ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా.. ఇప్పుడు ఆ డబ్బే కర్ణాటక ఎన్నికలను శాసిస్తోంది. ఆ మధ్య మన తెలంగాణలో మునుగోడు, హుజూరాబాద్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు అధికార భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి డబ్బును విపరీతంగా ఖర్చు చేశాయి. ఒక్కొక్క వోటర్ కు కోరినన్ని వరాలు ఇచ్చాయి.. ఓటుకు 5000 చొప్పున పంచాయి. ఈ ఎన్నికలు చూసే యావత్ దేశం మొత్తం ముక్కున వేలు వేసుకుంది. కానీ అంతకుమించి అనేలా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం సాగుతోంది.

ఖరీదైన ఎన్నికలుగా..

కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కుమారస్వామి పార్టీ జెడిఎస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ.. టి ప్రధానంగా 50 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది అనే విశ్లేషకులు అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఓట్లను చీలుస్తుందని చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కూడా ఈసారి పోటీలో ఉంది. దీని ప్రభావం మామ మాత్రమే కావచ్చు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఖర్చు మాత్రం దేశంలోనే కొత్త రికార్డు సృష్టిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఒక్కో పార్టీ అభ్యర్థి సగటున 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ఒక అంచనా. మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ సంఖ్య 70 కోట్ల వరకు చేరుతుందని సమాచారం. గత సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు అత్యంత ఖరీదైనవి గా మారిపోయాయి. ఇప్పుడు వీటన్నింటి రికార్డు కర్ణాటక బద్దలు కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాల క్రితం ఒక్కో అభ్యర్థి 20 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే సగటు కర్ణాటక రాష్ట్రంలో 50 కోట్లను అందుకుంది అనేది విశ్లేషకుల అంచనా. ఒక్కో అభ్యర్థి ఓటుకు 5000 వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. గత కొద్ది రోజుల నుంచి అభ్యర్థులు ఓటర్లను మరింత ప్రసన్నం చేసుకునేందుకు విందు, వినోదాల పేరిట భారీగా ఖర్చు చేస్తున్నారు. తిన్నోడికి తిన్నంత తిండి, తాగినోడికి తాగినంత మద్యం పోస్తున్నారు. పదిమందిని వెంట వేసుకొని వచ్చేవారికి ఒక రేటు, ప్రచారానికి తిరిగేవారికి మరొక రేటు చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు.

అవినీతికి లోటు లేదు

మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో రాజకీయ అవినీతి ఎక్కువ. నేతల కుంభకోణాలు కర్ణాటక రాష్ట్రంలో ముంజేతి కంకణమే. ఎన్నికల్లో సగటున 50 కోట్ల వరకు ఖర్చుపెట్టిన అభ్యర్థులు వాటిని ఏ రూపంలో తిరిగి వసూలు చేసుకుంటారనేది కర్ణాటక మొత్తం విధితమే. ఇప్పుడున్న బిజెపి మాత్రమే కాదు గతంలో పాలించిన కాంగ్రెస్ కూడా కుంభకోణాలతో ఇబ్బంది పడ్డదే. ఇక అక్కడ ఏ పార్టీకి కూడా సరైన ఫిగర్ రాకపోతే ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, పార్టీ ఫిరాయింపులు కూడా సర్వసాధారణమే. హంగ్ ఏర్పడుతుందనే భావనతో చాలామంది ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడుతున్నారు. తో తాము పెట్టిన ఖర్చుకు ఎలాగైనా గిట్టుబాటు అవుతుందనే ధైర్యంతో ఉన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version