తమ ప్రాంతాలకు వెళ్లేందుకు పాసుల కోసం కొంతమంది వలస కూలీలు పోలీసు స్టేషన్ కి వెళ్లిరు. స్థానిక ఎస్సై వారిని దూషించి, బూటుకాలితో తన్నిన ఘటన బెంగుళూరు లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పలురైళ్లను నడుతున్నా.. అనుమతులు లభించక చాలామంది కార్మికులు పడిగాపులు గాస్తున్నారు. పాసుల కోసం వెళ్లగా పలుచోట్ల వలస కార్మికులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. తాము స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ బెంగుళూరులోని కేజీ హోలీ పోలీస్ట్ స్టేషన్ కు వెళ్లిన కార్మికులపై స్థానిక అధికారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు.
ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి ఎస్డీ శరనప్ప మాట్లాడుతూ.. ‘ఉత్తర ప్రదేశ్ కి చెందిన కొంతమంది వలస కూలీలు స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే ఎస్సై రాజా సాహెబ్ వారితో దుర్భాషలాడారు. అంతేకాకుండా చేయి చేసుకుని బూటుకాలితో తన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఎస్సైను సస్పెండ్ చేశాము’ అని వివరించారు