spot_img
Homeజాతీయ వార్తలుఆ కిడ్నాప్‌ అంతా డ్రామానే..: సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ

ఆ కిడ్నాప్‌ అంతా డ్రామానే..: సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ

Hyderabad Pharma student
హైదరాబాద్ శివార్లలో ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కిడ్నాప్ వ్యవహారం మొత్తం ఆ యువతి ఆడిన డ్రామా అని ఆయన స్పష్టం చేశారు. తానే బట్టలు విప్పేసుకొని నాటకం ఆడిందని మహేశ్ భగవత్ తెలిపారు. గతంలో చిల్లర విషయంలో ఓ ఆటోడ్రైవర్‌‌తో గొడవ జరగడంతో.. పోలీసులు ఫొటోలు చూపించినప్పుడు అతణ్ని గుర్తించినట్లు చెప్పానని ఆ యువతి చెప్పిందన్నారు. ఆ అమ్మాయి చెప్పిన రూట్‌లో వందకుపైగా సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారని సీపీ తెలిపారు.

Also Read: మాయమాటలు చెప్పి 72 వృద్ధురాలిపై అత్యాచారం

‘పదో తేదీ సాయంత్రం 6.29 సమయంలో డయల్ 100కు ఓ కాల్ వచ్చింది. ఆ రోజు సాయంత్రం 5.30కి రాంపల్లి బస్టాప్ దగ్గర రోజూ కాలేజీ బస్సు దిగే అమ్మాయి.. ఆటోలో ఇంటికి వెళ్తోంది. కానీ ఆ అమ్మాయిని ఆటోలో ఎవరో తీసుకెళ్లిపోయారని సమాచారం ఇచ్చారు. కీసర, ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలికి ఫోన్ చేస్తే స్పందన లేదు. 7.50 గంటల సమయంలో అమ్మాయి ఫోన్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ అమ్మాయి లైవ్ లొకేషన్ షేర్ చేసింది. అన్నోజీగూడ పీఎస్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. ఆమె అర్ధనగ్నంగా.. కాలికి గాయంతో కనిపించింది. ఆమె సరిగా మాట్లాడలేకపోతోంది. దీంతో మేడిపల్లిలోని క్యూర్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

ఆటోలో తనను బలవంతంగా తీసుకెళ్లారు. ఇంజెక్షన్ ఇచ్చి.. తలపై కొట్టారని ఆ అమ్మాయి చెప్పింది. ఆటో ఆనవాళ్లను చెప్పింది. ఆ సమాచారంతో పోలీసులు ఆటో యూనియన్లను సంప్రదించాం. మూడు ఆటోలను గుర్తించి.. డ్రైవర్లను తీసుకొచ్చి ఫొటోలను చూపెట్టారు. ఒక ఆటో డ్రైవర్‌ను ఆమె గుర్తించింది. తమ అమ్మాయిని ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారని యువతి తల్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ రాత్రి హాస్పిటల్‌లో చికిత్స అందించారు. రెండో రోజు ఉదయం సమగ్రంగా బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్నాం. తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆమె చెప్పింది. తర్వాత మల్కాజ్‌గిరి హాస్పిటల్‌లో ఆమెకు మెడికల్ చెకప్ చేయించాం. దుస్తులు చింపేశారని.. కర్రతో కొట్టారని ఆ యువతి చెప్పింది. ఈలోపు ఆటో వాళ్లను ప్రశ్నించడం ప్రారంభించాం. ఆటో డ్రైవర్‌తోపాటు మరో నలుగుర్ని పిలిపించి వేర్వేరుగా ప్రశ్నించాం. తాము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నామని వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో సీసీటీవీ కెమెరాలను చెక్ చేస్తూ.. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించాం. ఆటో డ్రైవర్ చెప్పిన మాటలు నిజమని తేలింది.

అమ్మాయి కిడ్నాప్ జరిగినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ ఓ మల్టీ ఫ్లెక్స్‌కు వెళ్లారు. తర్వాత మందు తాగడానికి బార్ షాప్‌కు వెళ్లారు. అవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శాస్త్రీయంగా ఆధారాలు లభ్యం కావడంతో.. అమ్మాయిని మళ్లీ ప్రశ్నించాం. కానీ ఆమె అవే మాటలు మళ్లీ చెప్పింది. తనకు ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తూ.. ఆ అమ్మాయి రాంపల్లి చౌరస్తాలో బస్సు దిగిన విషయాన్ని గుర్తించాం. అక్కడే ఆమెతోపాటు సీనియర్ ఒకబ్బాయి అదే ఆటో ఎక్కాడు. సీనియర్ ముందు స్టాప్‌లో దిగి వెళ్లిపోయారు. హెరిటేజ్ స్టాప్ కాకుండా.. యంమనంపేట స్టాప్ దగ్గర ఫుటేజీ పరిశీలించగా.. అక్కడ ఆమె ఆటో దిగినట్లుగా గుర్తించాం.

దీంతో ఆటోడ్రైవర్ తనను ఆటోలో తీసుకెళ్లి.. తర్వాత వ్యాన్‌లో షిప్ట్ చేసి కిడ్నాప్ చేశారని ఆమె చెప్పిన మాటలు అబద్ధమని తేలింది. యంమనంపేట నుంచి అన్నోజిగూడ దాకా ఉన్న 100 కెమెరాలను పరిశీలించాం. దీనికి ఒకటిన్నర రోజు పట్టింది. ఆమె యంమనంపేట బస్టాండ్ నుంచి దిగి.. నడుస్తూ ఘట్‌కేసర్ ఏరియాలోని శ్రీనిధి కాలేజీ పక్క నుంచి వెళ్లారు. తర్వాత ఓ హోటల్ ముందు నుంచి వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమె మరో ఆటో ఎక్కింది. 7.20 సమయంలో అన్నోజిగూడ దగ్గర ఆ అమ్మాయి నడుస్తున్నట్లు గుర్తించాం.

Also Read: ఆలూ లేదు చూలూ లేదు.. అప్పుడే మంత్రి పదవులు పంచుకుంటున్నారు

7.20 నుంచి 7.50 మధ్య పోలీసులు, బంధువులు ఆ అమ్మాయికి ఫోన్ చేశారు. అప్పుడు ఒక్క కాల్‌కి స్పందించి లైవ్ లొకేషన్ పంపింది. పోలీసులు ఉన్నారని తెలియడంతో.. లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి పొదల్లో పడిపోయారు. ఆ సమయంలోనే ఆమె గాయపడింది. లైవ్ లోకేషన్ ఆధారంగా మా వాళ్లు అక్కడికి వెళ్లారు. అప్పుడు ఆ అమ్మాయి పై భాగంలో దుస్తులు లేవు.. కింద ప్యాంట్ కూడా సరిగా లేదు. పరిస్థితి సీరియస్‌గా ఉందని అనిపించింది. తాను పోలీసులను తప్పుదోవ పట్టించానని నిన్న రాత్రి రక్షిత మేడంకి చెప్పింది. తన దుస్తులు తానే తీసేశానని చెప్పింది. ఇంట్లో నుంచి తనను బయటకు పంపడం కోసమే ఇలా చెప్పానని పేర్కొంది. ఆమెకు కిడ్నాప్ అంటే ఇష్టమని తేలింది. ఆరు నెలల క్రితం ఆ అమ్మాయి తన స్నేహితురాలికి ఓ కిడ్నాప్ స్టోరీ చెప్పిందని తెలిసింది.

కిడ్నాప్ సబ్జెక్ట్ మీద ఆమెకు మంచి అవగాహన ఉంది. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, రేప్ చేయలేదు. ఆ అమ్మాయి వేరే బస్టాప్‌లో దిగి 4 కి.మీ. నడిచి.. అన్నోజిగూడలో దిగి.. పోలీసుల సైరెన్లు, తల్లిదండ్రులు ఫోన్లు చేయడంతో స్పందించారు. ఈ క్రమంలో ఎంతో సీన్ క్రియేట్ చేశారు. ఆ అమ్మాయి ఎక్కడికెళ్లిందనే వివరాలతో సీసీటీవీ ఫుటేజీతో ఓ వీడియా రూపొందించారు. గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా సమాచారం సేకరించారు. ఈ కేసులో ఆటోవాళ్లు మాకెంతో సహకరించారు. అదుపులోకి తీసుకొని విచారించిన అనుమానిత ఆటో డ్రైవర్లకు సారీ చెబుతున్నాం. ఈ వ్యవహారంలో వారికేం ప్రమేయం లేదు. ఓ ఆటోడ్రైవర్ గతంలో చిల్లర విషయంలో తనపై కోప్పడటంతో.. దాన్ని మనసులో పెట్టుకొని.. తాము చూపించిన ఫోటోల్లో నుంచి అతణ్ని గుర్తించినట్లు ఆ యువతి చెప్పింది. మూడు రోజులుగా ఎవరికీ నిద్రాహారాలు లేవు. ఎంతో టెన్షన్ పడ్డాం’’ అని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version