కాబుల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఐసిస్ -కె తీవ్రవాద స్థావరంపై తాము డ్రోన్ దాడి జరిపినట్లు చెప్పినా ఇది తప్పిదమే అని ప్రకటించారు. అమెరికా దళాలు అఫ్గనిస్తాన్ ను వీడి వెళ్లే సమయంలో ఈ దాడి జరిగిందని తెలిపారు. ఇంటిలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అభిప్రాయపడ్డారు. దీనికి బాధ్యత వహించి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఇకపై భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఐసిస్ తీవ్రవాదాదులను లక్ష్యంగా చేసుకున్నా తమకు అందిన సమాచారం సరైందని కాదని సూచించారు. ఇందులో దురదృష్టవశాత్తు పౌరులు కూడా చనిపోవడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. దీనికి తమ తప్పిదమే కారణమని ఒప్పుకున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని చెప్పారు. దీనికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని పేర్కొన్నారు.
అమెరికా సైన్యం చేసిన పనికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ దాడిలో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. దారుణ తప్పిదం నుంచి తప్పకుండా పాఠం నేర్చుకుంటామని చెప్పారు. అమెరికా చేసిన తప్పిదం వల్లే ఈ అన్యాయం జరిగిందని అందరిలో వస్తున్న ఆగ్రహం దృష్ట్యా మమ్మల్ని క్షమించాలని కోరారు. ప్రపంచం యావత్తు దీనిపై స్పందిస్తున్నక్రమంలో అమెరికా తన తప్పిదాన్ని ఒప్పుకుని ముందుకు రావడం సమంజసమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.