Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy Ramachandra Reddy:...

Peddireddy Ramachandra Reddy: తల్లి కోరిక తీర్చిన మంత్రి.. ఎల్లమ్మ ఆలయం రెండు నెలల్లో నిర్మాణం

Peddireddy Ramachandra Reddy: అధికారం ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే. కోరిందల్లా తీసుకురావచ్చు. కొండ మీది కోతినైనా తేవచ్చు. అధికారంలో ఉండే మజా అదే. అనుకున్నదే తడవుగా పనులు కూడా చకచకా జరిగిపోతాయి. ఆదేశాలు జారీ చేస్తే చాలు వాటంతటవే వేగంగా ముందుకు కదులుతాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం కూడా అహర్నిశలు శ్రమించి మంత్రి గారి ఆర్డర్ ను శిరసా వహించి ఆయన చెప్పిందే వేదంగా భావిస్తారు. ఏ పని చెప్పినా తూచ తప్పకుండా చేసేందుకు ఓకే చెప్పేస్తారు.

Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తల్లి కోరికను నెరవేర్చే క్రమంలో ఓ ఆధ్యాత్మిక కార్యాన్ని ఘనంగా నిర్వహించాడు. తమ స్వగ్రామమైన ఎర్రతివారిపల్లెలో సదుం ఎల్లమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో దాని ఆలనాపాలన కరువైంది. దీంతో దాన్ని పునర్నిర్మించాలని కోరడంతో దానికి మంత్రి సరే అని ఆగమేఘాల మీద పనులు చేయించి నిర్మాణం పూర్తి చేయించాడు. దీంతో ఆలయాన్ని ప్రారంభించారు.

తల్లి పద్మావతమ్మ కోరికను మంత్రి తీర్చారు. ఆలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. సోమవారం ఆలయంలో కుంబాభిషేకం నిర్వహించి తన తల్లి కోరికను నూటికి నూరుపాళ్లు నెరవేర్చాడు. దీంతో తల్లి కొడుకును దీవించింది.

Also Read: MLA Roja: మంత్రి పదవి కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కూడా కాదంట..?

రాష్ర్టంలో అధికారంలో ఉంటే ఆ దర్జాయే వేరుగా ఉంటుంది. వారు ఏది అనుకుంటే అది త్వరగా జరిగిపోతుంది. వారు కోరుకుంటే ఏదైనా ఇట్టే తీరిపోతోంది. తల్లి కోరుకున్నట్లుగా ఆలయం నిర్మించడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చొరవకు అంతా ముగ్దులవుతున్నారు.

Also Read: Narendra Modi: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?

Get notified whenever we post something new!

Continue reading

AP Rain Alert: ఏపీకి తీపికబురు.. ఇక అన్నీ మంచి రోజులే

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది....

AP land allotment: ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యాల కేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Two Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version