అందుకేనా కాపులతో పవన్‌ భేటీ..!

ఇన్నాళ్లు యూత్‌ పాలిటిక్స్‌.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను నమ్ముకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పంథాను మార్చుకున్నారని అర్థమవుతోంది. ఏకంగా ఇప్పుడు కుల రాజకీయాలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు తన బలం.. బలగం ఏంటన్నదో రియలైజ్‌ అయినట్లు అనిపిస్తోంది. తన నిర్లక్ష్యం కాస్త.. తన ఓటు బ్యాంకును బీజేపీకి వదులుకోవాల్సి వస్తోందనే ఆలోచనకు వచ్చారట. అందుకే.. ఇప్పుడు ఆయన కొత్త ప్రయత్నాల్లోకి దిగారు. Also Read: కయ్యానికి దిగి సాధించిందేంది..? తన పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 1:58 pm
Follow us on


ఇన్నాళ్లు యూత్‌ పాలిటిక్స్‌.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను నమ్ముకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పంథాను మార్చుకున్నారని అర్థమవుతోంది. ఏకంగా ఇప్పుడు కుల రాజకీయాలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు తన బలం.. బలగం ఏంటన్నదో రియలైజ్‌ అయినట్లు అనిపిస్తోంది. తన నిర్లక్ష్యం కాస్త.. తన ఓటు బ్యాంకును బీజేపీకి వదులుకోవాల్సి వస్తోందనే ఆలోచనకు వచ్చారట. అందుకే.. ఇప్పుడు ఆయన కొత్త ప్రయత్నాల్లోకి దిగారు.

Also Read: కయ్యానికి దిగి సాధించిందేంది..?

తన పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న కాపు వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు పవన్ చర్యలు ప్రారంభించారు. శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.కాపు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్, ఈడబ్ల్యూయస్ అమలు వంటి అంశాలపై పవన్ వారితో మాట్లాడుతారట.

Also Read: వైసీపీ రౌడీ రాజ్యానికి త్వరలోనే బుద్ది చెప్తామంటున్న బీజేపీ-జనసేన

అయితే.. తనపై కులం ముద్ర పడటం పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదట. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే చెప్పుకొచ్చారు కూడా. కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం తనకు నచ్చదని. కాపు సామాజికవర్గాన్ని నెత్తిమీద పెట్టుకోవడాన్ని కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం జరిగినప్పుడు.. నాయకత్వం వహించే అవకాశం వచ్చినా తనపై ముద్ర పడకూడదని లైట్ తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కానీ.. ఇప్పుడు వాటికి బలాదూర్‌‌ చెబుతూ ఆ రాజకీయాలనే నెత్తిన పెట్టుకుంటున్నారు. వారిని దగ్గరకు తీయకపోవడం వల్లనే ఓటు బ్యాంక్ వర్గం జనసేనకు ఏర్పడలేదని ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఏపీలో గణనీయ సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గం ఏకతాటిగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిస్తే.. బలమైన పోటీదారు అవుతారు. ఈ అంశాన్ని పవన్ గుర్తించినట్లుగా ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణాలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే.. ఇప్పుడు కాపు రాజకీయాల్లో ఆయన బిజీ అవుతున్నారు.