spot_img
Homeఎంటర్టైన్మెంట్Pithapuram ZP High School : పిఠాపురం ZP హై స్కూల్ లో 'నో అడ్మిషన్'...

Pithapuram ZP High School : పిఠాపురం ZP హై స్కూల్ లో ‘నో అడ్మిషన్’ బోర్డు.. పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్..

Pithapuram ZP High School : ప్రభుత్వ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడే రోజు వస్తుందని మనం ఎప్పటికీ ఊహించలేదు. కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇవి , నిజజీవితం లో చాలా కష్టం అని అంతా అనుకునేవారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ , కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడుతూ ర్యాంకులు సాధించడం సంచలనం గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యని అందించడం గమనించిన తల్లిదండ్రులు లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించడం కన్నా , ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడమే బెస్ట్ అని నిర్ణయించుకున్నారు కాబోలు , అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ బాగా పెరిగింది.

అందుకు ది బెస్ట్ ఉదాహరణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం. పిఠాపురం లోని మూలపేట లో ఉన్నటువంటి ZP హై స్కూల్ లో కాకినాడ జిల్లాలోనే ది బెస్ట్ ఫలితాలు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఈ పాఠశాలకు డిమాండ్ పెరిగింది, 7 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సీట్లు ఫుల్ అయిపోయాయి. దీంతో హై స్కూల్ సిబ్బంది గేట్ బయట ‘నో అడ్మిషన్స్ ‘ బోర్డు పెట్టారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ZP హై స్కూల్ సిబ్బందికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఉపాధ్యాయుల కష్టం, సిబ్బంది సహకారమే ఈ మార్పునకు కారణమని కొనియాడిన పవన్ కళ్యాణ్ , త్వరలోనే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈ పాఠశాలను సందర్శించబోతున్నట్టు తెలిపారు. మరోపక్క పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం లోని జడ్పీ పాఠశాలకు ఈ ఘనత దక్కడం పై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాలలు ఈ తరహా లో అభివృద్ధి చెందితే పేద ప్రజలకు ఎంతో మేలు చేసేవారు అవుతారని , దయచేసి స్టాండర్డ్స్ ని ఇంకా పెంచాల్సిందిగా కోరుతూ సోషల్ మీడియా లో నెటిజెస్ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ స్కీం డబ్బులు ఈ నెల 16, 17, 18 తేదీలలో పడబోతున్నాయి. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version