spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో పాక్షిక లాక్డౌన్ మే 31 వరకు పొడిగింపు

ఏపీలో పాక్షిక లాక్డౌన్ మే 31 వరకు పొడిగింపు

AP Lockdown

కరోనావైరస్ తీవ్రతను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమవారం పాక్షిక లాక్‌డౌన్‌ను నెల చివరి వరకు, అంటే మే 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. పాక్షిక లాక్డౌన్ లో రోజుకు 18 గంటలు “కర్ఫ్యూ” ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కఠిననిబంధనలు అమలు అవుతాయి. మే 31తో ఈ పాక్షిక లాక్డౌన్ ఏపీలో ముగుస్తుంది. మే 5 నుండి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.., ఉన్నత స్థాయి అధికారిక సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19ని నియంత్రించాలంటే ఆశించిన ఫలితాలను పొందాలంటే కర్ఫ్యూ పొడిగింపు అవసరమని అన్నారు. “ఏపీలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయ్యింది. కరోనా కేసులు తగ్గాలంటే కనీసం నాలుగు వారాల వరకు లాక్ డౌన్ అమలులో ఉండాలి” అని జగన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా చూసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సంక్షోభాన్ని పరిష్కరించడానికి గ్రామ వాలంటీర్లు.. ఆశా కార్మికులు మరియు గ్రామ సచివాలయ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని జగన్ సూచించారు. కోవిడ్ -19 తో తల్లిదండ్రులు మరణించడం వల్ల పిల్లలు అనాథలుగా మారితే, అలాంటి పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ ఆదేశించారు. అలాంటి అనాథలకు సహాయం చేయడానికి ఆర్థిక పథకాన్ని రూపొందించాలని జగన్ సూచించారు. కొంత మొత్తాన్ని వారి పేరు మీద జమ చేయవచ్చు అని.. అక్కడ నుండి వచ్చే వడ్డీని ప్రతి నెలా వారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని జగన్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలే నెలాఖరు వరకు కొనసాగుతాయని సీఎం జగన్ తెలిపారు. కరోనా ఉధృతితో ఏపీలో 5న కర్ఫ్యూ అమలు చేశారు. ఈనెల 18వ తేదీ వరకు ఉంటుందని ప్రభుత్వం నాలుగో తేదీ వెల్లడించిన విషయం తెలిసిందే.. కోవిడ్ కేసులు తగ్గకపోవడంతో పగటి పూట కర్ఫ్యూను పొడిగించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper