Homeజాతీయ వార్తలుTanot Mata Temple: మనదేశంలో సైనికుల ఇలవేల్పు ఈ గుడి.. పాకిస్తాన్ 3000 బాంబులేసినా ఏం...

Tanot Mata Temple: మనదేశంలో సైనికుల ఇలవేల్పు ఈ గుడి.. పాకిస్తాన్ 3000 బాంబులేసినా ఏం కాలే..

Tanot Mata Temple: పాకిస్తాన్ మనదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సరిహద్దుల్లో బాంబులు వేసింది. మనదేశంలో మత కల్లోలాలు సృష్టించింది. నకిలీ కరెన్సీ రూపొందించి మన ఆర్థిక రంగాన్ని నాశనం చేయాలని భావించింది. అంతర్జాతీయ ముఠాలతో చేతులు కలిపి.. విధ్వంసానికి పాల్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది. అయినప్పటికీ భారత్ నిలబడింది. ప్రపంచ వేదికల మీద స్థిరంగా ఉండగలిగింది. అందువల్లే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా భారత్ అవతరించింది. కేవలం ఉగ్రవాదాన్ని.. పైశాచికత్వాన్ని మాత్రమే నమ్ముకున్న పాకిస్తాన్.. అట్టడుగున ఉండిపోయింది.

ఈరోజుకు పాకిస్తాన్ దేశంలో సరైన సదుపాయాలు లేవు. రోడ్ల నుంచి మొదలు పెడితే తాగునీటి వరకు ప్రతి విషయంలోనూ వెనుకబడే ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మనదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఓ గుడి మీద దాదాపు 3,000 వరకు బాంబులు వేసింది. జై సల్మీర్ సరిహద్దుల్లో పురాతన తనోట్ మాతా దేవాలయాన్ని నేలమట్టం చేయాలని భావించింది. ఇక్కడ ఎన్నో రకాల విధ్వంసాలకు పాల్పడింది. ఇంత జరిగినప్పటికీ ఈ ఆలయం చెక్కుచెదరలేదు. పాకిస్తాన్ ఈ స్థాయిలో దాడులు చేయడానికి ప్రధాన కారణం ఒకటుంది.

ఈ ఆలయాన్ని భారత సైనికులు తమ ఇలవేల్పులాగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని థార్ వైష్ణో దేవి అని పిలుస్తుంటారు. ఈ ఆలయ నిర్వహణను భారత సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు స్వయంగా చూసుకుంటారు. పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా సరే ఈ ఆలయం స్థిరంగా నిలబడిందని.. వైష్ణో దేవి అమ్మవారు దేశాన్ని కాపాడే శక్తి అని ఇక్కడ సైనికులు పేర్కొంటారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. 1965 కాలంలో పాకిస్తాన్ ఈ ఆలయం పై 3000 బాంబుల వరకు వేసింది. ఎప్పటికీ ఆలయం ఏమీ కాలేదు. అంతేకాదు ఒక బాంబు కూడా పేలలేదు. నాడు పాకిస్తాన్ వదిలిన ఆ బాంబులను మ్యూజియంలో భద్రపరిచారు.

భారత సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలో ఉన్నప్పటికీ.. ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తుంటారు. నవరాత్రి నుంచి మొదలు పెడితే అనేక ఉత్సవాల వరకు ఇక్కడ వేడుకలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని విదేశీ యాత్రికులు కూడా సందర్శిస్తుంటారు. కాకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పూర్తిగా పరిశీలించిన తర్వాతే వారిని ఆలయ సందర్శనకు పంపిస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version