Homeజాతీయ వార్తలుOperation Sindoor 2.0: పేలుళ్ల వేళ 'ఆపరేషన్ సింధూర్ 2.0'.. ట్రెండింగ్

Operation Sindoor 2.0: పేలుళ్ల వేళ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’.. ట్రెండింగ్

Operation Sindoor 2.0: ఢిల్లీలోని ఎర్రకోట మొదటి గేటు వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్ సంఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలపై భారత నిఘా బృందం ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇది ఉగ్రవాది దాడినా? లేదా మరి వ్యక్తుల పని అయి ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలు ప్రాంతాల్లో వెంటనే పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మరి ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరగకుండా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ 2.0 అనే పదం ట్రెండీగా మారింది. ఎందుకంటే?

పుల్వామా ఘటన తర్వాత భారత్ సీరియస్ యాక్షన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో భాగంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ నిర్వహించే ఈ యుద్ధం కు’ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది. పుల్వామా ఘటనలో ఒక మహిళ తన భర్తను కోల్పోయిన చిత్రం దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించింది. ఇకనుంచి ఏ మహిళ బొట్టు తుడిచి పెట్టకుండా కాపాడుతామంటూ నినదిస్తూ ఈ యుద్ధానికి ఆపరేషన్ సింధూరం అని పేరు పెట్టారు.

అయితే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0 పేరు బాగా వినిపిస్తోంది. అంటే మళ్లీ ఉగ్రవాదులపై దాడి చేయాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పుల్వామా ఘటన విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయమే.. ఇప్పుడు కూడా తీసుకోవాలంటూ కొందరు కోరుతున్నారు. ఇది ఉగ్రవాదుల పని అంటూ.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ 2.0. అని పేరు పెట్టి దాడులు చేయాలని నినదిస్తున్నారు. కొందరు ఈ పేరుతో ప్రత్యేకంగా పోస్టల్ లు తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటికి చాలామంది లైక్స్ కొట్టడమే కాకుండా మిలియన్ల కొద్ది షేరింగ్ చేస్తున్నారు.

దీనిని బట్టి చూస్తే దేశ ప్రజల్లో మరోసారి ఆగ్రహ జ్వాలలు రేకెత్తినట్లు తెలుస్తోంది. అయితే కారు బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత వెంటనే ప్రధానమంత్రి, హోం మంత్రి తో పాటు త్రివిధ దళాలు అప్రమత్తమై సమావేశాలు నిర్వహించాయి. బాబు బ్లాస్ట్ వెనుక ఎవరు ఉన్నారన్నదే కీలకం అని భావిస్తున్నారు. ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే స్పష్టమైన సమాచారం తెలిసిన తర్వాతే నిర్ధారించరున్నారు. అయినా కూడా ఇది ఉగ్రవాదుల పని అన్నట్లు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతుందా? అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇప్పటికే రక్షణ దళాలు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో తనిఖీలు, కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఏ చిన్న అనుమానం వచ్చినా.. అనుమానిత వ్యక్తులు ఎవరైనా సరే విడిచి పెట్టేది లేదని భావిస్తున్నారు. మరి ప్రజలు కోరుతున్నట్లు ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుందా? లేదా? చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version