ప్రజల మద్దతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

ప్రజల మద్ధతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘’ 64 వ భాగంలో మాట్లాడుతూ కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తోంది. క్లిష్ట సమయంలో పోలీసులు, వైద్యులు, మీడియా మిత్రులు ప్రాణాలొడ్డి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్థులకు అండగా నిలిచాయని కొనియాడారు. దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయని చెబుతూ ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని హితవు చెప్పారు. కరోనా పోరాటంలో మన జీవన విధానమే మన బలం అని […]

Written By: Neelambaram, Updated On : May 31, 2020 1:48 pm
Follow us on


ప్రజల మద్ధతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘’ 64 వ భాగంలో మాట్లాడుతూ కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తోంది. క్లిష్ట సమయంలో పోలీసులు, వైద్యులు, మీడియా మిత్రులు ప్రాణాలొడ్డి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్థులకు అండగా నిలిచాయని కొనియాడారు.

దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయని చెబుతూ ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని హితవు చెప్పారు. కరోనా పోరాటంలో మన జీవన విధానమే మన బలం అని తెలిపారు.

కరోనా భారత్‌లోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని అందరూ భావించారని గుర్తు చేశారు. అయితే వ్యాపారులు భౌతికదూరం పాటిస్తూ అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొంటూ భవిష్యత్తులో మనం మరింతపెంచుకోవాలని స్పష్టం చేశారు.

యోగాసానాల ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థికరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అంటూ కరోనా వల్ల వలసకూలీలు చాలా ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు.

శ్రామిక్ రైళ్ల ద్వారా వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెబుతూ వలసకూలీల కోసం వారి గ్రామాలలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. యావత్ దేశం వలస కూలీలకు అండగా నిలిచిందని కొనియాడారు.

లాక్డౌన్‌లో విద్యారంగంలో అనేక ఆవిష్కరణలు చేశారని పేర్కొంటూ ఆన్‌లైన్ పాఠాల కోసం కొత్త ఆవిష్కరణలు వచ్చాయని తెలిపారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ముందుడుగు వేశామని చెబుతూ ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు వరంగా మారిందని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటిమందికి పైగా చికిత్స తీసుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఆ కోటి మందిలో 80 శాతం మంది గ్రామీణులే అని చెప్పారు. పేదల డబ్బును ఆయుష్మాన్ భారత్ యోజన ఆదా చేస్తుందని చెప్పారు.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు తక్కువ అని చెబుతూ కరోనా కట్టడిలో ఇతర దేశాల కంటే భారత్ ముందుందని ప్రధాని చెప్పుకొచ్చారు. కరోనాపై మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని స్పష్టం చేశారు.