ఇప్పుడు అందరికీ మోహన్‌బాబే గుర్తొస్తున్నారు..: ఎందుకంటే..

ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్‌ తేజశ్రీ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజస్వి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తేజస్వి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. తేజస్వినికి మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని.. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లించాలని చెప్పగా.. తమకు చదివించే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు అసహాయతను వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర […]

Written By: Srinivas, Updated On : February 7, 2021 1:54 pm
Follow us on


ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్‌ తేజశ్రీ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజస్వి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తేజస్వి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. తేజస్వినికి మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని.. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లించాలని చెప్పగా.. తమకు చదివించే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు అసహాయతను వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తేజస్విని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Also Read: రాజుకుంటున్న ‘ఉక్కు’ ఉద్యమం

అయితే.. తేజశ్రీ ఆత్మహత్యకు గల కారణం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం. తండ్రి ఫీజు కట్టడం కోసం ఐదు రూపాయలు.. పది రూపాయల వడ్డీకి తెచ్చి వారితో మాటలు పడటం చూడలేక.. తానే భారమయ్యాయనని ప్రాణం తీసుకుంది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనాత్మకం అవుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన కొద్ది బకాయిల్ని చెల్లించిన తర్వాత.. ఇక నుంచి కాలేజీలకు రీయింబర్స్‌మెంట్ లేదని.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. కానీ.. ఇప్పటి వరకూ వేసిన పాపాన పోలేదు. దీంతో కాలేజీలన్నీ విద్యార్థుల వద్ద ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.

అయితే.. తేజశ్రీ ఆత్మహత్యపై ముందుగా ప్రతిపక్ష నేత చంద్రబాబే స్పందించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకిస్తలేరంటూ దబాయించారు. నాడు నేడు అంటూ కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించబోమని కాలేజీ యాజమాన్యాలు చెబుతుంటే విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ తేజశ్రీ ఆత్మహత్య అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: ‘బాస్’ మనసులో ఏముంది..? ఉత్కంఠగా గులాబీ శ్రేణులు..

ఇదిలా ఉండగా.. ఇప్పుడు అందరూ మోహన్ బాబునే గుర్తు చేసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఆయన తన కాలేజీ విద్యార్థుల్ని తీసుకుని రోడ్డుపై పడుకుని ప్రదర్శన చేశారు. నిజానికి అప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్‌గా చెల్లిస్తోందని.. ఆ త్రైమాసికానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ నడుస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయినా ఆయన ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఆందోళన చేశారు. తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ స్పందించడం లేదు. ఓ ఇంటర్యూలో ఇప్పుడూ తనకు ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదని.. ఆస్తులు తాకట్టు పెట్టుకున్నానని బాధపడ్డారు. మరి ఇప్పటికైనా మోహన్‌ బాబు స్పందిస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్