Homeఆంధ్రప్రదేశ్‌నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..

నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..

Nimmagadda Ramesh Kumar

నిమ్మగడ్డ కేసులో అనేక రకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయం ఏప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టకుండా చేసేందుకు ప్రభుత్వం, ఎలాగైనా బాధ్యతలు తీసుకోవాలని రమేష్ కుమార్ పట్టుదలతో ఉండటంతో ఈ కథలో ట్విస్టులకు అంతు లేకుండా పోతుంది. తాజాగా నిమ్మగడ్డ కేసు విషయంలో హై కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరో పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు నిమ్మగడ్డ ను ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం నియమించకపోవడాన్ని గత శుక్రవారం జరిగిన విచారణలో తప్పుబట్టింది. గవర్నర్ ను కలవమని నిమ్మగడ్డకు సూచించింది.

Also Read: జగన్ కు మరో లేఖ రాసిన రామకృష్ణంరాజు..

హై కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ పొందారు. ఈ సెల 20 తేదీ సోమవారం ఉదయం 11.30 గంటలకు కలిసేందుకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి హై కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషనర్ గా తనను నియమించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని తెలియజేసి గవర్నర్ జోక్యాన్నికోరనున్నారు. దీంతో గవర్నర్ హై కోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నిక కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వానికి సూచించే అవకాశం ఉంది. గవర్నర్ సూచన చేస్తే తప్పని సరిగా పాటించాల్సి వస్తుందని భావించిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య లేకుండా సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది.

Also Read: చంద్రబాబును ఎన్టీఆర్ తో కొడుతున్న జగన్

హై కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో గతంలో ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ విచారణలో సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హై కోర్టు తీర్పు సమంజసంగానే ఉందని ఈ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడవద్దని ప్రభుత్వానికి సూచించింది. అప్పటి పిటీషన్ పై విచారణ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ప్రభుత్వం మరో పిటీషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీం కోర్టు ఈ పిటీషన్ విచారించిన అనంరతం ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version