spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ నేతలు మరో పార్టీకి వెళ్లకుండా నయా స్కెచ్

YCP: వైసీపీ నేతలు మరో పార్టీకి వెళ్లకుండా నయా స్కెచ్

YCP: వైసిపి అధినేత జగన్ పక్క రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చి సంచలనం రేపారు. అత్యంత నమ్మకస్తులను సైతం మార్చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతనే సైడ్ చేశారు. తనతో జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకటరమణకు సైతం హ్యాండ్ ఇచ్చారు. మంత్రి విడదల రజిని లాంటి మహిళా నేతకే స్థానచలనం కల్పించారు. సమీప బంధువు బాలినేనికే చుక్కలు చూపిస్తున్నారు. ఇవన్నీ పక్కా వ్యూహంతో చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచేందుకేనని ప్రచారం జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా తన పార్టీలోనే కాకుండా.. ఎదుట పార్టీలో స్థానం లేకుండా సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది.

తాడేపల్లి ప్యాలెస్ లో కార్పొరేట్ ఇంటర్వ్యూల తరహాలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ జరుగుతుంది. ముందుగా ఎంపీ మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. అనంతరం సీఎం జగన్ వద్దకు వారిని చేర్చుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ లను ఎంత తిడితే అంత మైలేజ్ వస్తుందని.. అటువంటి వారికే అధినేత ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి, వారిని తిట్టడానికి వంతన ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉత్పన్నమవుతోంది. ఇలా కలుస్తున్న వారు వారి వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మీకు తిట్టాలని చెప్పారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకటే సమాధానం వస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు.

తాను తప్పించడమే కాకుండా.. టిడిపి, జనసేనలోకి వెళ్లడానికి వీలు లేకుండా చేసేందుకే.. వారితో చంద్రబాబు, పవన్ లపై తిట్టిస్తున్నారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ తరహాలో కుట్రలు చేస్తే కానీ.. వైసీపీ సిట్టింగులు తమ దరికి రారని.. వేరే పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ తిట్ల పురమాయింపని తెలుస్తోంది. వైసీపీ నేతలకు బూతుల పోటీలు పెట్టడం వెనుక సజ్జల మార్కు కుట్ర ఉన్నట్లు స్పష్టం అవుతోంది. టిక్కెట్లు ఇవ్వకపోయినా వారు జనసేన, టిడిపిలోకి వెళ్లకుండా… ఇప్పించే ప్రక్రియకు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. పేర్ని నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ, అమర్నాథ్ సహా ఎంతో మంది నేతలకు టికెట్ ఇవ్వకపోయినా వేరే పార్టీలో చేరలేరు. ఎందుకంటే వారు విపక్ష నేతలను ఉద్దేశించి ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఫార్ములాను మిగతా నేతల విషయంలో అమలు చేస్తున్నారు.

ఏడాది కిందట చాలామంది వైసిపి నాయకులు దూకుడుగా ఉండేవారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేవారు. కానీ వారి మాటలో ఇటీవల వాడి తగ్గింది. అనుచిత వ్యాఖ్యల జోలికి పోవడం లేదు. ఎన్నికల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో? ఎవరు అధికారంలోకి వస్తారో? అధికారం తారుమారయితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నను చాలామంది వైసిపి నాయకులు తమను తాము సంధించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అయినా కాస్తంత సంయమనం పాటిస్తే బెటరని భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేయగలం కానీ.. వ్యక్తిగత కామెంట్లకు మాత్రం దూరమని తేల్చి చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper
Exit mobile version