Nara Lokesh’s Letter To Jagan: రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అన్ని దేశాలపై ప్రభావం పడింది. అక్కడ వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వారిని చదివించేందుకు ముందుకొచ్చింది. వారి విద్య కోసం అయ్యే ఖర్చు తామే భరిస్తామని చెబుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థుల భవితవ్యంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు.

ఉక్రెయిన్ వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్ కోసం వారికయ్యే ఖర్చును భరించి వారిని చదువుకునేలా చూడాలని కోరారు. దీంతో లోకేష్ రాసిన లేఖతో జగన్ పై మరో పిడుగు పడినట్లు అయింది. అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతున్న సందర్భంలో ఇప్పుడు విద్యార్థులను చదివించాలంటే మాటలు కాదు. రూ. కోట్లు ఖర్చవుతాయని జగన్ ఆలోచనలో పడిపోతున్నారు.
Also Read: Wine Shops Closed In Hyderabad: మందు బాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్
పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఏపీ కూడా విద్యార్థుల కోర్సులు పూర్తయ్యేందుకు ముందుకు రావాల్సిన అవసరముంది. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వారి చదువు పూర్తయ్యేలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 740 మంది విద్యార్థులు వచ్చారని తెలుస్తోంది. వారి విద్య కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

మనదేశంలో రూ. కోటి వరకు ఖర్చయ్యే వైద్య విద్య కోసం ఉక్రెయిన్ లో అయితే రూ.25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు కావడంతో విద్యార్థులు అక్కడకు వెళ్లడం తెలిసిందే. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు అక్కడకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కోర్సు పూర్తి కాక తిరిగి వచ్చిన వారి సమస్యను ప్రభుత్వమే చొరవ చూపి వారికి సాయం చేయాల్సిన అవసరం గుర్తించాలని లోకేష్ లేఖలో కోరడం తెలిసిందే.
Also Read: BJP Social Media Controversy: సరికొత్త వివాదం: బీజేపీకి ఫేస్ బుక్ మిత్రపక్షమా?
[…] Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. క… […]
[…] Pawan Kalyan vs YCP: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన జనసేన 9వ ఆవిర్భవ సభలో పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లు ముందుగానే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడం, పొత్తులపై క్లారిటీ ఇవ్వడం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అవలంభించాల్సిన వ్యూహాలను జనసైనికులకు వివరించే ప్రయత్నం చేశారు. […]
[…] Washing Machine: బట్టలు ఉతకాలంటే ఒకప్పుడు చేతులతోనే చేసేవారు. కానీ ఇప్పుడు చాలా ఇండ్లలో వాషింగ్ మిషిన్ వచ్చేసింది. దాంతో చాలామంది వీటిల్లో బట్టలు వేసేసి ఉతికేసుకుంటున్నారు. అయితే ఇలా మిషిన్లో వేసేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల బట్టలు చిరిగిపోతుంటాయి అయితే కొన్ని టిప్స్ పాటిస్తే సురక్షితంగా బట్టలు ఉతుక్కోవచ్చు. […]
[…] Congress Party: దేశాన్ని ఎన్నో ఏళ్ళపాటు అప్రతిహతంగా ఏలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ ను, దేశాన్ని వేర్వేరుగా చూడలేమని ఎంతోమంది మేధావులు చెబుతుంటారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాకపోవడంతో క్యాడర్ లో నిస్తేజం అలుముకుంది. దీనికితోడు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూడటం జీర్ణించుకోలేని ఆపార్టీ నేతలే అధినాయకురాలిపై ధిక్కారస్వరంగా విన్పిస్తున్నారు. […]
[…] Sakshi News Paper: ప్రింట్ మీడియా పరిస్థితి అద్వానంగా మారుతోంది. అంతా డిజిటల్ మయం అయిపోతున్న నేపథ్యంలో ప్రింట్ మీడియా ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోంది. దీనికి తోడు కేంద్రం కూడా పన్నులు వేస్తుండటంతో పత్రికలు నడపలేని స్థితిలో పడిపోతున్నాయి. అందుకే పేజీలు తగ్గించుకుంటున్నాయి. కొన్ని పత్రికలైతే ఇక డిజిటల్ కే వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాక్షి కూడా అదే తోవలో ప్రయాణిస్తోంది. పేపర్ సర్క్యులేషన్ పెంచుకునేందుకు నానా తంటాలు పడుతోంది. […]