spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nadendla Manohar: జనసేన ఆవిర్భావ సభపై నాదెండ్ల మనోహర్ సీరియస్ కామెంట్స్

Nadendla Manohar: జనసేన ఆవిర్భావ సభపై నాదెండ్ల మనోహర్ సీరియస్ కామెంట్స్

Nadendla Manohar: ప‌వ‌న్ క‌ల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించిన జ‌న‌సేన పార్టీకి.. ఈ మార్చి 14తో ఎనిమిదేండ్లు పూర్త‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆవిర్భావ స‌భ‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు పార్టీ నేత‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆవిర్భావ స‌భ‌కు కూడా ప్ర‌భుత్వం ఆటంకాలు క‌లిగిస్తోందంటూ ఆరోపిస్తున్నారు పార్టీ కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్‌. వారంలో ఇప్ప‌టికే దాదాపు నాలుగు సార్లు స‌భా స్థ‌లం మారిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Nadendla Manohar
Nadendla Manohar

మంగ‌ళ‌గిరిలోని మండ‌లం ప‌రిస‌ర ప్రాంతంలో స‌భ‌ను నిర్వ‌హించేందుకు తాము వెళ్లి రైతులతో మాట్లాడిన‌ప్పుడు భూములు ఇవ్వ‌డానికి ఒప్పుకున్నార‌ని, కానీ ఇప్పుడు మాత్రం వెన‌క‌డుగు వేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. రైతుల మ‌న‌సు ఎవ‌రు మారుస్తున్నారో త‌మ‌కు తెలుసంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంత క‌క్ష పూరితంగా వేధించ‌డం ఏంటంటూ విమ‌ర్శిస్తున్నారు.

Also Read: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై అంటే కేసీఆర్ కు ఎందుకు కోపం?

ప్ర‌జ‌లు ఓట్లేసి 151ఎమ్మెల్యే సీట్ల‌ను క‌ట్ట‌బెడితే ఇంత అరాచ‌క పూరితంగా పాల‌న సాగిస్తున్నార‌ని ఆగ్ర‌హం తెలిపారు మ‌నోహ‌ర్‌. ఇక ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా న‌ష్ట‌ప‌రిచేందుకు ఇప్ప‌టికే ఎన్ని ర‌కాల కుట్రలు చేస్తున్నారో ప్ర‌జ‌లు చూస్తున్నారంటూ వాపోయారు. అయితే ప‌వ‌న్‌ను ఎంత న‌ష్ట‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించినా.. తాము మాత్రం పోరాడుతూనే ఉంటామ‌ని చెప్పుకొచ్చారు.

Nadendla Manohar
Nadendla Manohar Pawan

భీమ్లానాయ‌క్ విష‌యంలో ఇప్ప‌టికే ఎంత కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించారో ఆంధ్రా ప్ర‌జ‌లు చూశార‌ని, ప‌వ‌న్ వెంట ప్ర‌జ‌లు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. కాగా వారం రోజుల్లోనే నాలుగు చోట్ల‌కు స‌భా స్థ‌లం మార‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే.. ఇదంతా ప్లాన్ ప్ర‌కార‌మే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అటు ఇత‌ర పార్టీల్లో కూడా జ‌న‌సేన ప‌ట్ల వైసీపీ వైఖ‌రిని అంద‌రూ ఖండిస్తున్నారు.

Also Read: తెలంగాణ‌లో లిక్క‌ర్ ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper