Atal Setu : ఇవేం కట్టడాలు.. ‘అటల్ సేతు’లోనూ అక్రమాలు.. వెలుగులోకి షాకింగ్ ఫొటోలు

Atal Setu ఇదిలా ఉండగా, అటల్ సేతుపై పగుళ్లపై రాజకీయ దుమారం చెలరేగిన వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. ఓ కార్మికుడు రోడ్డుపై తారు వేయగా, మరో సెక్షన్ ను కంకరతో కప్పారు.

Written By: NARESH, Updated On : June 22, 2024 9:28 pm

Atal Setu

Follow us on

Atal Setu : ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎంటీహెచ్ఎల్) గా ప్రసిద్ధి చెందిన అటల్ బిహారి వాజ్‌పేయి సేవారి-నవా షెవా ‘అటల్ సేతు’ ఉల్వే వైపు వెళ్లే రోడ్డుపై పగుళ్లు కనిపించాయి. దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన అయిన ఈ అటల్ సేతు 5 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

ప్రారంభించి ఐదు నెలల్లోనే బ్రిడ్జిపై పగుళ్లు ఏర్పడ్డాయని ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే, దీనిపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం అటల్ సేతును కలిపే అప్రోచ్ రోడ్డులో చిన్నపాటి పగుళ్లు కనిపించాయని, ప్రభావిత ఫుట్ పాత్ ప్రధాన వంతెనలో భాగం కాదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శుక్రవారం (జూన్ 21) ఘటనా స్థలాన్ని సందర్శించి పగుళ్లను పరిశీలించారు.

‘మేం కేవలం ఆరోపణలు చేయడం లేదు మీకు చూపించేందుకే నేను ఇక్కడికి వచ్చాను. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చిత్రీకరిస్తోందని, కానీ ఇక్కడ అవినీతిని చూడవచ్చు అన్నారు. వారు జేబులు నింపుకుంటున్నారని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో ప్రజలు ప్రణాళిక వేసుకోలి’ అని పటోలే అన్నారు.

రూ.17,840 కోట్లతో ఎంటీహెచ్ఎల్ ను ఈ ఏడాది (2024) జనవరిలో ప్రధాని మోడీ ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజపేయి పేరును ఈ వంతెనకు పెట్టారు. ముంబై – నేవీ ముంబై మధ్య కనెక్టివిటీని పెంచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ను పూర్తి చేశారు.

అందరూ గౌరవించే మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పేరును వంతెనకు పెట్టారని, ఆయన పేరుతో ఉన్న వంతెన నిర్మాణంలో అవినీతి జరగడం దురదృష్టకరమని పటోలే అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ గమనించాలని కోరారు. తారు రోడ్డుకు ఒకవైపు పగుళ్లు కనిపించాయి. అయితే అటల్ సేతు ప్రధాన భాగంలో ఎలాంటి పగుళ్లు లేవని వంతెన నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) స్పష్టం చేసింది.

‘అటల్ సేతును కలిపే అప్రోచ్ రోడ్డులో చిన్నపాటి పగుళ్లు కనిపించాయి. ఈ ఫుట్ పాత్ ప్రధాన వంతెనలో భాగం కాదని, వంతెనను కలిపే సర్వీస్ రోడ్డు అని పేర్కొన్నారు. ఈ పగుళ్లు ప్రాజెక్టులో నిర్మాణ లోపాల వల్ల కాదని, వంతెన నిర్మాణానికి ఎలాంటి ముప్పు లేదని కూడా గుర్తించాలి’ అని ఎంఎంఆర్డీఏ పేర్కొంది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ అటల్ సేతుపై ఎటువంటి పగుళ్లు లేవని, దానికి ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

‘ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది- అబద్ధాలతో చీలిక ప్రజల మనసులను కలుషితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల సమయంలో బీజేపీ రాజ్యాంగ సవరణలు చేస్తుందంటూ.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫోన్ల ద్వారా ఈవీఎంలను టాప్ చేశారని, ఇప్పుడు ఇలాంటి అబద్ధాలు. దేశ ప్రజలు దరార్ (క్రాక్) ప్రణాళికను, కాంగ్రెస్ అవినీతి ప్రవర్తనను గమనిస్తున్నారన్నారు.

ఇదిలా ఉండగా, అటల్ సేతుపై పగుళ్లపై రాజకీయ దుమారం చెలరేగిన వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. ఓ కార్మికుడు రోడ్డుపై తారు వేయగా, మరో సెక్షన్ ను కంకరతో కప్పారు.