MP Salary Issue: రాజకీయాలు అంటేనే మన దేశంలో అదో మురికి కూపం అంటారు అందరు. ఇక నేటితరం యువత నిరుద్యోగం కారణంగా నేతల వెంట తిరుగుతూ టైంపాస్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేది మాత్రం సంపన్నులే. ప్రజల్లో ఇమేజ్ ఉన్నా పాకెట్లో మనీ లేకపోతే ఓట్లు రాలవు. ఇక ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలా మంది ప్రజాసేవను వదిలేసి సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ, ఎంపీ కంగనా రనౌత్ మాత్రం ప్రజాప్రతినిధి జీతం దేనికి చాలదంటున్నారు. ఇంకో ఉద్యోగం చేస్తే కానీ బతుకుబండి సాగదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ నాయకుల ఆర్థిక సవాళ్లను, నిజాయితీతో రాజకీయాలు చేయడం వల్ల ఎదురయ్యే ఆటంకాలను ఎత్తి చూపుతున్నాయి.
ఎంపీ జీతం సరిపోదు…
కంగనా రనౌత్ తన ఎంపీ జీతం 50–60 వేల రూపాయలు ఉంటుందని, అయితే నియోజకవర్గంలో పర్యటనలు, పీఏలు, పార్టీ నేతల సమావేశాలు, ఇతర ఖర్చులు లక్షల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఖర్చులను భరించడానికి ఎంపీ జీతం సరిపోదని, అందుకే అదనపు ఉద్యోగం లేదా వ్యాపారం అవసరమని స్పష్టం చేశారు. నిజాయితీతో రాజకీయాలు చేయాలనుకునే వారికి ఇది మరింత సవాలుగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు నాయకులు తమ నియోజకవర్గ బాధ్యతలను నిర్వహించడానికి ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఆర్థిక నిజాయితీ, పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా మంది ఎంపీలు వ్యాపారవేత్తలు, న్యాయవాదులు లేదా ఇతర వృత్తుల్లో ఉంటూ ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారని ఆమె సూచించారు. ఈ సందర్భంలో, రాజకీయాలను పూర్తి సమయం వృత్తిగా చేయడం సామాన్య ఎంపీలకు సవాలుతో కూడుకున్న విషయంగా కనిపిస్తుంది. ఈ వాదన రాజకీయ వ్యవస్థలో ఆర్థిక సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చకు దారితీస్తుంది.
Also Read: Kiran Kumar Journey: వేలతో మొదలుపెట్టి.. రూ.17 వేల కోట్లు కొల్లగొట్టాడు
నేతల ఖర్చులు అనేకం..
నియోజకవర్గంలో పర్యటనలు, సమావేశాల నిర్వహణ, సిబ్బంది నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు వంటివి భారీ ఖర్చులకు దారితీస్తాయి. ఈ ఖర్చులు ఎంపీల జీతంతో సమతూకంలో ఉండవు. అందుకే అదనపు ఆదాయ వనరులు అవసరమని కంగనా వాదన. ఈ సందర్భంలో, రాజకీయ వ్యవస్థలో ఖర్చుల నిర్వహణ, పారదర్శకత, ఎంపీలకు అందించే ఆర్థిక సౌకర్యాలపై పునరాలోచన అవసరమని కంగనా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. రాజకీయాల్లో నిజాయితీతో ఉండే వారు ఎదుర్కొనే సవాళ్లను వెల్లడిస్తున్నాయి. నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకునే వారికి ఆర్థిక ఒత్తిడి ప్రధాన అడ్డంకిగా ఉంటుంది. ఈ సమస్య రాజకీయ వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని సూచిస్తుంది.
BJP MP Kangana Ranaut during a public gathering had claimed that she had received a Rs 1 lakh bill for her Manali residence where she didn’t even stay.
Now, Himachal Pradesh State Electricity Board fact-checked her claim. They claimed that Kangana didn’t pay her bills on time… pic.twitter.com/fKDtUKAqPL— Mohammed Zubair (@zoo_bear) April 10, 2025