spot_img
Homeజాతీయ వార్తలురేవంత్ సింగిల్ ప్రచారం.. ‘చేయి’కలపని నేతలు

రేవంత్ సింగిల్ ప్రచారం.. ‘చేయి’కలపని నేతలు

Revanth Reddy
ఒకప్పుడు పేరున్న పార్టీ అది. కురవృద్ధ రాజకీయనేతలకు అడ్డా వారి పార్టీ. పేరుమోసిన నేతలు.. రాజకీయ ఉద్దండులున్న కాంగ్రెస్ పార్టీలో నేతలు రానురాను హస్తగతం అవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రథమస్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధమస్థానంలోకి వెళ్లిపోయింది. పొద్దున లేస్తే.. కార్యకర్తలతో జనాల్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఇండ్లు.. పార్టీ ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. కొరవడిన ఐకమత్యం.. ఎవరికివారే లీడర్ షిప్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్నది వాస్తవం. అయితే 2018 ఎన్నికలు పక్కన పెడితే.. ప్రధాన జీహెచ్ఎంసీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నేతలు ప్రచారానికి కాలు కదపడం లేదు. ప్రచారాన్ని మొత్తం రేవంత్ రెడ్డి ఒక్కనే బుజాన ఎత్తుకుని ముందుకు సాగుతున్నాడు.

Also Read: తెలంగాణలోని ఆ ప్రాంతంలో పందుల పోటీలు.. ఫ్రైజ్ మనీ ఎంతంటే..?

అయితే టీపీసీసీ చీఫ్ పదవికోసం చాలా మంది చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం వద్దు.. ఆయనకన్నా.. మాకు స్టామినా.. ఎక్కువుంది అని వాదిస్తున్న నేతలు.. పార్టీ పరమైన కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికివారే సొంత యాత్రలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఒంటరి ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. అదే స్పూర్తితో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ మినహా ఎవరూ కనిపించడం లేదు.

Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల..!

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. అప్పుడప్పుడు నల్లగొండలో ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ కోసం పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి చిన్నారెడ్డిని పోటీలో నిలిపింది.అక్కడ కూడా సీనియర్లు ఎవరూ కనిపించడం లేదు. ఎంపీ రేవంత్ రెడ్డి సర్వం తానై వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీనియర్లు కూడా ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు.కలిసొచ్చే ఒకరిద్దరు నాయకుల సాయంతోనే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకుండా భట్టి విక్రమార్క.. జీవన్ రెడ్డి లాంటి నేతలు.. సొంత యాత్రలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ.. సైకిల్ యాత్ర చేపడుతున్నారు. అదికూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమేనని వారు కవర్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూసి.. పదవులు ఇస్తేనే ప్రచారం చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేదని.. కాంగ్రెస్ హై కమాండ్ అలా ఉన్నంతకాలం కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రాదని పలువురు విశ్లేషకులు అంటన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper