Homeఆంధ్రప్రదేశ్‌వైయస్సార్ ను అడ్డం పెట్టుకొని జగన్ కు మంట పెట్టిన ఎంపీ రాజు..?

వైయస్సార్ ను అడ్డం పెట్టుకొని జగన్ కు మంట పెట్టిన ఎంపీ రాజు..?

Viral Pic: RRR Shows His Strength | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఏపీ రాష్ట్ర అధికార పార్టీ వివాదాస్పద పార్లమెంటు సభ్యుడు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొకసారి వార్తల్లోకెక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన…. సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన రాజుగారికి లోపల ఎంత ఉందో తెలియదు గాని… ఆయన మాత్రం వైఎస్ఆర్ పరమభక్తుడనని రాజు చెప్పుకుంటాడు. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి అయిన నేపథ్యంలో ఆయన ఫోటో పై పూలు కురిపించి నివాళులు అర్పించిన ఎంపీ రాజు ఈ సంధర్భంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలను రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పడం గమనార్హం.

ఎంపీ రాజు మాట్లాడుతూ…. ఒక సారి ఏదో న్యూస్ పేపర్ లో చంద్రబాబు నాయుడు ఫోటో ని కార్టూన్ లాగా గీసిన బొమ్మ ను తాను రాజశేఖర్ రెడ్డికి చూపించానని…. అయితే వెంటనే అతను అది చూసి సీరియస్ అయిపోయి న్యూస్ పేపర్ ని పక్కకి విసిరి కొట్టారు అని ఆయన అన్నారు. ఇది ఏమీ బాగోలేదు అని…. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని ఇలా కించపరచడం తగదని వైఎస్ అన్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఇలా చేయడం అవమానించినట్లే అని…. చంద్రబాబు నాయుడు పట్ల మనం ఎప్పుడడూ గౌరవాన్ని చూపించాల్సిందే అని వైఎస్ చెప్పినట్లుగా రాజు గుర్తుచేసుకున్నారు.

“ఆయన సంస్కారానికి ఆ రోజున మనసులోనే నమస్కారం పెట్టాను” అంటూ ఆ సందర్భంలో రాజు గారు తన ఫీలింగ్ గురించి వెల్లడించారు. ఇతరులను గౌరవించడం వల్లే అతను లెజెండ్ లా ఎదిగారని రాజు గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ వార్తలన్నీ అటు టిడిపి సపోర్టర్లు జగన్ ను ఉద్దేశించి చేసినట్లుగా అంటున్నారు. జగన్ చంద్రబాబు పైన అసెంబ్లీలో విరుచుకుపడుతున్న తీరు…. ఎప్పటికప్పుడు వైసిపి నేతలు బాబుని ఎన్ని రకాలుగా కావాలంటేఅన్ని రకాలుగా అవమానించిన వైనాన్ని రాజు ఇప్పుడు ఎత్తిచూపుతున్నారని అంటున్నారు.

అంతేకాకుండా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ వైఎస్ ఏనాడూ తన పథకాలకు తన పేరు పెట్టలేదని…. రాజీబ్ గాంధీ పేరు, ఇందిరా గాంధీ పేర్లు మాత్రమే పెట్టారు అని గుర్తు చేశాడు. ఇప్పుడు జగన్ తన పథకాలకు ‘జగనన్న’ అని కొన్నిటికి ముందు తన పేరుని ట్యాగ్ లా తగిలించుకున్న విషయాన్ని రాజు తప్పు అని చెప్పడమేనా ఇది…? అని వైసిపి వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఏదైనా ఈమధ్య రాజు ఏది చేసినా సెన్సేషన్…. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper