Homeజాతీయ వార్తలుModi: దాయాదికి చెప్పి మరీ దెబ్బకొట్టాం.. బాలకోట్‌ దాడులపై సంచలన నిజం చెప్పిన మోదీ!

Modi: దాయాదికి చెప్పి మరీ దెబ్బకొట్టాం.. బాలకోట్‌ దాడులపై సంచలన నిజం చెప్పిన మోదీ!

Modi: దొడ్డి దాడిన దాడిచేయడం.. వెన్నుపోటు పొడవడం, దొంగదెబ్బతీయడంపై తనకు నమ్మకం లే దని, పదేళ్ల క్రితం పుల్వామా దాడికి ప్రతీకారంగా, దాయాది దేశం పాకిస్థాన్‌కు చెప్పి మరీ పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌పై దాడు చేశామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. శత్రువు ఎదురుగా నిలబడి కలబడడమే తనకు తెలుసన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిపిన వైమానిక దాడులు అప్పట్లో యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా ముష్కరులకు మన వాయుసేన ముచ్చెమటలు పట్టించింది. తాజాగా ఎన్నికల్లోనూ ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్‌పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతనే మీడియాకు వెల్లడించినట్లు తెలిపారు.

ఎక్కడ నక్కినా వదిలిపెట్టం..
ఇది నవభారత్‌.. మనకు హాని తలపెట్టే ముష్కరులు వారి సొంత దేశంలో ఎక్కడ నక్కినా వేటాడి మరీ చంపేస్తాం. వెనుక నుంచి దెబ్బతీయడంపై మోదీకి నమ్మకం లేదు. శత్రువులో నిలబడి పోరాడతాం.2019నాటి బాటాకోట్‌ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టాలనుకోలేదు. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందుగా చెప్పాం అని ప్రధాని వివరించారు. ముందే మీడియాకు వెల్లడించాలని తాను మన బలగాళకు చెప్పానని, అంతకంటే ముదు పాకిస్థాన్‌కు ఈ విషయం చెప్పానన్నా. ఆ రోజు రాత్రి దాయాది దేశ అధికారులకు ఫోన్‌ చేస్తే వారు స్పందించలేదు. అందుకని, బలగాలను కొద్దిసేపు వేచిఉండమని చెప్పానని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతనే ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాం.. మోదీ దేనిని దాచిపెట్టడు. ఏది చేసిన బహిరంగంగానే చేస్తాడు అని తెలిపారు.

సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై దాడి..
2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీష్‌ జవాన్లను జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. దీనికి ప్రతీకంరంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని తాము ఎప్పటికీ సహించబోమని ఈ ఘటనతో భారత్‌.. పాక్‌ సహా ప్రపంచ దేశాలకు గట్టిగా సందేశం ఇచ్చింది. అయితే బాలాకోట్‌ఘటన జరిగిన రోజు ఉదయం భారత్‌పై ప్రతిదాడికి దిగింది పాక్‌. మన గగనతలంలోకి వారి యుద్ధవిమానాలు దూసుకొచ్చాయి. అయితే పాకిస్థాన్‌ చర్యను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే మిగ్‌ విమానం ఒకటి కూలి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రుచెరలో చిక్కారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడితో మూడు రోజుల తర్వాత పాక్‌ అతడిని భారత్‌కు అప్పగించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper