Narendra Modi Israel Visit 2026: ఫిబ్రవరి 25, 26 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్కు రెండురోజుల పర్యటన చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ సందర్భం భారత–ఇజ్రాయెల్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ పర్యటనను యూదు సంస్థల సదస్సులో ప్రకటించారు. మోదీ రెండు రోజులు ఇజ్రాయెల్లో ఉంటారు. తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో భేటీ కానున్నారు. మోదీ కూడా నెతన్యాహుతో ఉన్న సత్సంబంధాలను దాచుకోలేదు. వ్యవసాయ రంగంలో సహకారం. వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కోఆపరేషన్, ఏఐలో సహకారం. సెక్యూరిటీ విషయంలో పరికరాల ఎగుమతి విషయంలో చర్చలు జరుగుతాయి.
ద్వైపాక్షిక చర్చలు
మోదీ–నెతన్యాహు భేటీలో వ్యవసాయ సహకారం, నీటి నిర్వహణ, ఏఐ, సెక్యూరిటీ పరికరాల ఎగుమతులు ప్రధానాంశాలు. ఆపరేషన్ సిందూర్లో ఇజ్రాయెల్ డ్రోన్ సాంకేతికత సహాయం అందించడం రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్లో (క్నెసెట్) ప్రసంగం చేయనున్నారు.
హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్
నెతన్యాహు ప్రతిపాదించిన హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్ (ఆరు ముఖాల వ్యూహం)లో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ కీలకం. ఒక ఆఫ్రికన్, ఒక అరబ్ దేశాలు చేరనున్నాయి. తుర్కీ, అజర్బైజాన్కు చెక్గా గ్రీస్–సైప్రస్ను చేర్చారు. ఇది భద్రతా, ఆర్థిక, రణనీతి సహకారాన్ని పెంచుతుంది.
ప్రాంతీయ సవాళ్లు
షియా రాడికల్ కూటమి (ఇరాన్, హమాస్, హెజ్బుల్లా, హౌతీలు) మధ్యప్రాశాంతికి ముప్పు. రాడికల్ సున్నీ కూటమి (సౌదీ, తుర్కీ, పాకిస్తాన్ అనుమానం) ఇజ్రాయెల్పై ప్రభావం చూపుతోంది. ఇరాన్ యుద్ధాలు, గల్ఫ్ ఉద్రిక్తతలు ఇండియా–మిడిల్ ఈస్ట్ కారిడార్ను ఆలస్యం చేశాయి. తాజా హెగ్జాగాన్ అలయన్స్తో భద్రత పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ పర్యటన భారత్ను మిడిల్ ఈస్ట్ వ్యూహాల్లో కీలక భాగస్వామిగా నిలబెడుతుంది. హెగ్జాగాన్ కూటమి షియా–సున్నీ ముప్పులకు బలమైన సమాధానం. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కొత్త అవకాశాలు తెరుస్తాయి.