ఆంధ్రప్రదేశ్‌YCP Ministers : చెప్పులేసుకొని పిలుపులు.. ఏపీ బ్రాండ్ ను గంగలో కలిపేస్తున్న మంత్రులు

YCP Ministers : చెప్పులేసుకొని పిలుపులు.. ఏపీ బ్రాండ్ ను గంగలో కలిపేస్తున్న మంత్రులు

YCP Ministers : :మొన్నటివరకూ ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ప్రపంచంలో మారుమూల ప్రాంతానికి వెళ్లినా గుర్తించేటంతగా ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగు రాష్ట్రం ఇప్పుడు పలుచన అవుతోంది. పాలకుల తీరతో నవ్వులపాలవుతోంది. వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి, మంత్రులు ప్రదర్శిస్తున్న తెలివితేటలు రాష్ట్ర చరిత్రను మసకబారుస్తున్నాయి. ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కదా అతిగా వ్యవహరిస్తోంది. అన్నివిధాలుగా పాలనను అపహాస్యం చేస్తూ ఏపీని చులకన చేస్తున్నారు. దేశంలో ఏపీ అంటేనే అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు.

ఆ మధ్యన దావోస్ వాణిజ్య సదస్సుకు ఎందుకు వెళ్లలేదంటే.. ఐటీ మంత్రి అమర్నాథ్ ఒక వింతైన సమాధానం చెప్పారు. అక్కడ విపరీతంగా చలి ఉంటుంది. అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలు స్నానం చేయరు. అందుకు వెళ్లలేదంటూ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. మనం ఎందుకు దావోస్ వెళ్లడం? మన దగ్గరకే దావోస్ వస్తుందని తుంటరి జవాబిచ్చారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకునేలా మంత్రి వ్యాఖ్యానాలు సాగాయి. ఇటువంటి మాటలతో పారిశ్రామిక ప్రపంచం ఏపీని గౌరవిస్తుందా? అన్న అనుమానం ప్రతిఒక్కరికీ కలుగక మానదు. అయితే మేం చేసేదే చట్టం.. మేం అన్నదే మాట అని తాము పట్టిన కుందేలు.. వంద కాళ్లు అన్నరీతిలో పాలకులు వ్యవహరిస్తుంటే రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని నిట్టూర్చడమే కానీ ఎవరూ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి మనది.

అప్పు.. ఈ మాట అంటే ప్రతిఒక్కరికీ భయం. కానీ ఏపీ ప్రభుత్వానికి అప్పు అనేది ఒక వరం. చివరకు తాను వద్దంటుకున్న అమరావతి రాజధానిపై అప్పు తెచ్చిన గడసరి నేర్పరి జగన్ సర్కారు. అమరావతి గొంతు నొక్కడమే కాదు..దాని పేరిట అప్పులు తెచ్చి జాతీయ సమాజంలో మరింత నవ్వులపాలుచేయడం దేనికి సంకేతం. అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్ సర్కారు రూ.3 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఆ అప్పు కట్టకపోగా.. వడ్డీ సైతం చెల్లించడం లేదు. బ్యాంకర్లు అడుగుతుంటే ముఖం చాటేస్తున్నారు. రేపోమాపో బ్యాంకులు సీఆర్డీఏను దివాళాగా ప్రకటించవచ్చు. జగన్ సర్కారుకు కూడా కావాల్సింది అదే. అమరావతి రాజధాని పేరిట చేసిన అప్పులు మళ్లించి ఎంచక్కా హాయిగా ఉన్న జగన్ సర్కారు చర్యలు ఇప్పుడు వారికి ఇంపుగా ఉండొచ్చు కానీ.. అవగాహన ఉన్న వారికి కంపే..

విశాఖలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సును కనివినీ ఎరుగని రీతిలో చేస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ కంపెనీలు వస్తాయని నమ్మించారు. ఇప్పుడు తీరుబాటుగా దేశీయ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు పలుకుతున్నారు. ఐటీ మంత్రి , ఒక ఐఏఎస్ అధికారిని వెంటబెట్టుకొని పెళ్లి శుభలేఖలు ఇస్తున్నట్టుగా సదస్సుకు పిలుపులందిస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారికి ఇట్టే మైండ్ బ్లాక్ అవుతోంది. ఏ మాత్రం ఫ్రొఫెషనిజం చూపకుండా డ్రెస్ సెన్స్ లేకుండా పారిశ్రామికవేత్తలను డీల్ చేసిన తీరు మాత్రం జుగుప్సాకరంగా ఉంది. అంత పెద్ద పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే సమయంలో చెప్పులేసుకొని వెళతారా? కనీసం షూ వేసుకొని వెళ్లరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కార్పొరేట్ రంగంలో చిన్న ఉద్యోగానికి ఎటువంటి ప్రమాణాలు ఉంటాయో తెలియంది కాదు. కానీ పనితనం రాదు.. పని చేతకాదు అన్నట్టు వ్యవహరించి ఏపీ పరువును తీస్తున్నారు. అయితే ఇక్కడ పరువు పోతోంది ఏపీది కానీ.. సీఎం జగన్.. మంత్రులది కాదు. అందుకే కాబోలు వారు ఇలా వ్యవహరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Visakhapatnam: విశాఖకు పోటెత్తుతున్న వైసీపీ మంత్రులు.. ఏం జరుగుతోంది?

ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో పాతిక మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ఆరుగురు. వీరు తమ స్వస్థలాల నుంచి రాకపోకలు సాగించే అవకాశాలు ఉన్నాయి.

Pawan Kalyan Vs YCP Ministers: ప్రజలను తిట్టొద్దన్న పాపానికి.. పవన్ పై వైసీపీ రభస

Pawan Kalyan Vs YCP Ministers: పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక బాధ్యతాయుతమైన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య సంవాదం జరుగుతున్న నేపథ్యంలో పవన్ స్పందించారు. రాజకీయ నేతలు వేరు.....

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....