Homeఆంధ్రప్రదేశ్‌Dharmana Prasada Rao: ధర్మాన" మాటలకు అర్ధాలే వేరులే

Dharmana Prasada Rao: ధర్మాన” మాటలకు అర్ధాలే వేరులే

Dharmana Prasada Rao: వైసీపీ నేతలకు అసలు సీన్ అర్థమవుతోంది. ప్రజలు తమపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలుసుకుంటున్నారు. కొందరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. మరొకరు వైరాగ్యపు మాటలు చెబుతున్నారు. కొంతమంది సీనియర్లు అయితే ఇక లాభం లేదని.. మీ ఇష్టమని.. మీరు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అవుతాను. లేకుంటే మాత్రం నీకు ఇప్పుడు అందుతున్న సేవలు అన్ని నిలిచిపోతాయని, సంక్షేమం అందని ద్రాక్షగా మిగులుతుందని తేల్చి చెబుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందంజలో ఉండడం విశేషం.

శ్రీకాకుళం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఆయనే. అందుకే ఈసారి విజయం కోసం గట్టిగా కష్టపడాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. జిల్లా కేంద్రం కావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికంగా ఉంటారు. ఎగువ మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉంటాయి. ప్రస్తుతం ఆ వర్గాలన్నీ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. ఆ ఓట్లు పడవని ధర్మాన ప్రసాదరావు ఒక డిసైడ్ కు వచ్చారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రజల మైండ్ లో మార్పు తేవాలని భావిస్తున్నారు. ఒక రకంగా ప్రజలకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామానికి ఇటీవల వెళ్లారు. మీకు ఓట్లు అడగను.. నా పని తీరు నచ్చితేనే ఓట్లు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. మీ వరకు మీకు మంత్రిగా ఉంటాను. ఏ పనైనా చేయిస్తాను. నేను మళ్ళీ కావాలన్నా.. మంత్రిగా రావాలన్నా ఓటు వేయండి. అలాకాకుండా టిడిపికే ఓటు వేస్తే మాత్రం వచ్చే జూన్ నుంచి మీ ఇంటి వద్దకు వలంటీర్ రాడు. పింఛన్ అందదు.. అంటూ ఒక రకమైన హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కృష్ణుడు వ్యాసం వేశారని.. ఆయన పార్టీకి ఓట్లు వేస్తే నష్టపోతారనిప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు మాట్లాడారు.

గత కొంతకాలంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా అర్బన్ ఓటర్లు అభివృద్ధి కనిపించకపోవడంతో వ్యతిరేకంగా మారారు. అటు అన్ని సర్వేల్లో సైతం వైసీపీకి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. దీంతో ధర్మాన వైఖరి మార్చుకున్నారు. ప్రజలను బుజ్జగిస్తూనే హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక్కో సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. అయితే సుదీర్ఘకాలం ధర్మాన ప్రసంగాలు, చతురత కలిగిన మాటలు చూసిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. దీంతో ధర్మాన పునరాలోచనలో పడిపోయారు. అందుకే వైరాగ్యపు మాటలు, బ్లాక్ మెయిల్ తరహా వ్యాఖ్యలతో సొంత పార్టీ శ్రేణులకు విస్మయ పరుస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version