ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి సందడి

భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ దంపతులు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి మెలానియా సందడి చేశారు. దక్షిణ మోతీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హ్యాపీనెస్ క్లాస్’ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళకు స్వాగతం పలికేందుకు సర్వోదయ కో-ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్‌ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మెలానియా ట్రంప్‌ కు […]

Written By: Neelambaram, Updated On : February 25, 2020 4:59 pm
Follow us on


భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ దంపతులు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి మెలానియా సందడి చేశారు. దక్షిణ మోతీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హ్యాపీనెస్ క్లాస్’ సమావేశానికి ఆమె హాజరయ్యారు.

అమెరికా ప్రథమ మహిళకు స్వాగతం పలికేందుకు సర్వోదయ కో-ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్‌ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మెలానియా ట్రంప్‌ కు స్వాగతం పలికేందుకు పాఠశాల విద్యార్థులు ప్రకాశవంతమైన రంగు, రంగుల చీరలు, ‘ఘగ్రా-చోలి’ వంటి సంప్రదాయ దుస్తులను ధరించారు. వారిలో కొందరు బ్యాగ్‌ పైపులు మరియు ఇతర సంగీత వాయిద్యాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఆమె సందర్శించిన మొదటి తరగతి గది పెయింటింగ్స్‌తో అలంకరించబడింది మరియు “పుస్తకాల నిధిలోకి స్వాగతం ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.”అని అక్కడున్న బోర్డు పై రాసి ఉంది.

మెలానియా మరొక తరగతికి వెళ్లారు. అక్కడ బోర్డు మీద “మా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ను మా హ్యాపీ వరల్డ్‌కు స్వాగతిస్తున్నాము” – మరియు చెట్ల పెయింటింగ్‌ కు “కృతజ్ఞతా గోడ”(Gratitude Wall) అని పేరు పెట్టారు. గేట్లు కూడా వివిధ చిత్రాలతో అలంకరించబడ్డాయి మరియు వాటిపై “వెల్‌కమ్ టు హ్యాపీనెస్ క్లాస్” అనే పదాలు ఉన్నాయి.

ఆ తరవాత మెలానియా పాఠశాలలో ‘హ్యాపీనెస్ క్లాస్‌’లకు హాజరయ్యారు, ఇందులో భాగంగా విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, పిల్లలలో ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించే లక్ష్యంతో ప్రాథమిక విధేయత వంటి వివిధ కార్యక్రమాలు నేర్పుతారు.

అమెరికా నుండి తమ అతిథిని అలరించడానికి బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేసే పిల్లలతో ఆమె పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విధంగా పాఠశాల విద్యార్థులతో మెలానియా ట్రంప్ తన సెషన్‌ ను పూర్తిగా ఆనందిస్తున్నట్లు అనిపించింది.

మెలానియా ట్రంప్‌ రాకముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమెను స్వాగతిస్తూ.. ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు మా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఢిల్లీ వాసులకు గొప్ప రోజు. ఎందుకంటే మా పాఠశాలలో “హ్యాపీనెస్ క్లాస్” కి అమెరికా ప్రథమ మహిళ(మెలానియా ట్రంప్‌) హాజరవుతారు. శతాబ్దాలుగా, భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మికతను నేర్పింది. ఆమె మా పాఠశాల నుండి ఆనందం యొక్క సందేశాన్ని తిరిగి తీసుకువెళ్లనుంది అని చెప్పడానికి నేను సంతోషితున్నాను” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

‘హ్యాపీనెస్ క్లాస్’ ను 2018 లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, ప్రాథమిక విధేయత మరియు పిల్లలలో ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించే లక్ష్యంతో సహా వివిధ కార్యకలాపాలు నేర్పుతారు.