కీసరలో ‘లంచం’ రికార్డును దాటేసిన అడిషనల్ కలెక్టర్

తెలంగాణలో ఇప్పటివరకు అత్యధికంగా లంచం పట్టుబడి రికార్డు సృష్టించింది కీసరలోనే. కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్ గా అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు పట్టుబడ్డాడు. ఈ సంఘటన తెలంగాణతో యావత్ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆ సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో అధికారి రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. Also Read: ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం! కీసర సంఘటనను తలదన్నేలా […]

Written By: NARESH, Updated On : September 9, 2020 12:58 pm
Follow us on

తెలంగాణలో ఇప్పటివరకు అత్యధికంగా లంచం పట్టుబడి రికార్డు సృష్టించింది కీసరలోనే. కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్ గా అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు పట్టుబడ్డాడు. ఈ సంఘటన తెలంగాణతో యావత్ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆ సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో అధికారి రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

Also Read: ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం!

కీసర సంఘటనను తలదన్నేలా మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి తాజాగా పట్టుబడ్డాడు. నర్సాపూర్ డివిజన్లోని చిప్పలకుర్తి గ్రామంలోని 113 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు కోటి 12లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కోటి రూపాయల మేర ఆస్తులకు లంచం కింద ఒప్పందం పత్రాలు రాసుకున్నాడు. తొలి విడుతగా బాధితులు 40లక్షల డబ్బులు నగేష్ కు ముట్టజేబుతుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

తెలంగాణ సర్కార్ కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తుందటంతో తమ ఆటకు సాగవని రెవిన్యూ అధికారులు గ్రహించినట్లు ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడే అందినకాడికి దోచుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే అత్యాశకు పోయిన నగేష్ బాధితుల నుంచి లంచానికి కోటి 12లక్షల లంచానికి ఒప్పందం పత్రం రాసుకున్నాడు. ఈ ఒప్పంద పత్రమే ప్రస్తుతం అతడిని ఈ కేసు నుంచి తప్పించుకోకుండా చేసినట్లు కన్పిస్తుంది.

Also Read: కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టంతో అవినీతిని అంతమొందిస్తారా…?

నగేష్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెండ్ గా పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. అతడి ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, బ్లాక్ చెక్కులు, ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. కోటి 12లక్షల లంచానికి సంబంధించిన డీలులో 40లక్షల నగదు, 72లక్షలకు భూమి రిజిష్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం రాసుకోవడం ఈ కేసులో ట్వీస్ట్ గా మారింది. అవినీతి అధికారుల దురాశే.. చివరికీ వారిని కటకటల వెనక్కి పంపుతుందని తాజా సంఘటన మరోసారి నిరూపించింది.