ఈ కారణంతో కూడా మద్యం ధరలు పెంచుతారా!

తెలంగాణలో మద్యం ధరల పెంపుకు సంబంధించి ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో 75శాతం వరకు లిక్కర్ ధరలను పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే మన రాష్ట్రంలోనూ ధరలను పెంచినట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. పెరిగిన ధరలతో సంబంధం లేకుండా 43 రోజుల తర్వాత తెలంగాణలో లిక్కర్ షాపులు తెరచుకోవడంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బీర్లు, లిక్కర్ కోసం భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 6:00 pm
Follow us on

తెలంగాణలో మద్యం ధరల పెంపుకు సంబంధించి ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో 75శాతం వరకు లిక్కర్ ధరలను పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే మన రాష్ట్రంలోనూ ధరలను పెంచినట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

పెరిగిన ధరలతో సంబంధం లేకుండా 43 రోజుల తర్వాత తెలంగాణలో లిక్కర్ షాపులు తెరచుకోవడంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బీర్లు, లిక్కర్ కోసం భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద పరిస్థితిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైన్ షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.