కంగనకు మహారాష్ట్ర సీఎం ఠాక్రే వార్నింగ్?

దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది బాలీవుడ్ క్వీన్ కంగన రౌనతే. ఆమె ముంబై వెళ్లి మరీ శివసేన సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో బాలీవుడ్ మాఫియాను, శివసేన సర్కార్ ను  ఏకిపారేస్తోంది. ఈ క్రమంలోనే శివసేన భగ్గుమంది. కంగనా ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధంలోకి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఎంట్రీ ఇచ్చారు. వారం రోజులుగా సాగుతున్న వీరిద్దరి మధ్య వివాదం […]

Written By: NARESH, Updated On : September 13, 2020 5:55 pm
Follow us on

దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది బాలీవుడ్ క్వీన్ కంగన రౌనతే. ఆమె ముంబై వెళ్లి మరీ శివసేన సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో బాలీవుడ్ మాఫియాను, శివసేన సర్కార్ ను  ఏకిపారేస్తోంది. ఈ క్రమంలోనే శివసేన భగ్గుమంది. కంగనా ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధంలోకి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఎంట్రీ ఇచ్చారు. వారం రోజులుగా సాగుతున్న వీరిద్దరి మధ్య వివాదం తాజాగా గవర్నర్ వద్దకు చేరింది. ఆదివారం సాయంత్రం కంగనా మహారాష్ట్ర గవర్నర్ ను కలవబోతున్నారు.

Also Read: అమిత్ షా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా?

కంగన ఆఫీసు కూల్చడంపై మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ను కంగన కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అలెర్ట్ అయ్యారు. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కంగనకు వార్నింగ్ ఇచ్చారు. తాము మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం చేతకాని తనం కాదని కంగనను పరోక్షంగా హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నానని ఉద్దమ్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు సాగుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనాతోపాటు తమను విమర్శిస్తున్న వారితో పోరాటం చేస్తున్నామని ఉద్దవ్ తెలిపారు.

Also Read: సుశాంత్ ఫామ్ హౌస్ లోనే డగ్స్ పార్టీలు?

కరోనాపై పోరాడుతున్నామని మహారాష్ట్రలో రికవరీ రేటు పెరిగిందన్నారు. వైరస్ ను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్ టు డోర్ వైద్యసేవలను విస్తరిస్తున్నామన్నారు.

మహారాష్ట్ర గవర్నర్ తోపాటు కంగన కూడా ఇప్పుడు శివసేన సర్కార్ ను టార్గెట్ చేయడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు కంగనకు వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా సంచలనమైంది.