Left parties decline in India: ఒక దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు.. కచ్చితంగా అక్కడి భావజాలాన్ని కలిగి ఉండాలి. అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉండాలి. అలా కాకుండా అరువు తెచ్చుకున్న విధానాలతో పనిచేస్తాం. విదేశీ విధాలను కొనసాగిస్తాం.. ఎక్కడివో సిద్ధాంతాలను జనాల మీద రుద్దుతామంటే కుదరదు. అప్పుడు ఉద్యమాలు చేశాం.. రైతుల పక్షాన నిలబడ్డాం. అంటే జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే నేటి కాలంలో ఒకప్పటి విధానాలు పనికిరావు. ఇప్పటి వర్తమానాలు మాత్రమే జనాలకు కావాలి.
మనదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలుగా వామపక్షాలకు పేరుంది. రైతుల పక్షాన.. పేదల పక్షాన వామపక్షాలు అనేక పోరాటాలు చేశాయి. పాలక ప్రభుత్వాలను నేలకు దించాయి. మనదేశంలో తయారీ కేంద్రంగా పేరుపొందిన బెంగాల్ రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నాయి వామపక్ష పార్టీలు. త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా వామపక్షాలు అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. నిన్నటి వరకు కూడా కేరళ రాష్ట్రంలో వామపక్షాలు పరిపాలన సాగించాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలు తప్పుకొని చాలా సంవత్సరాలు అయింది. త్రిపుర వంటి రాష్ట్రం నుంచి కూడా వామపక్షాలు అధికారం నుంచి దూరం జరిగాయి. ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయి.. తెలుగు రాష్ట్రాల్లో కామ్రేడ్లు తమ ప్రాతినిధ్యం కోల్పోయారు. తమిళనాడు వంటి రాష్ట్రంలో కూడా కామ్రేడ్లు బలం కోల్పోయారు.
కేరళ రాష్ట్రంలో యు డి ఎఫ్ దూకుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఎల్ డి ఎఫ్ ఓటని పాలైంది. ఫలితంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని కూడా కమ్యూనిస్టులు కోల్పోయారు. ఒకప్పుడు బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఒక వెలుగు వెలిగారు. త్రిపుర రాష్ట్రంలో కూడా సత్తా చూపించారు. కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉన్న కేరళ రాష్ట్రంలోనే వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయంటే.. ఇక దేశంలో మిగతా రాష్ట్రాలలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సిద్ధాంతాల ప్రకారం జాతీయతను ఇష్టపడుతున్నారు. భావజాలాన్ని సొంతంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మార్పుకు బలమైన సంకేతాలు. ఈ మార్పును గనుక వామపక్షాలు పాటించకపోతే.. దేశం నుంచి వామపక్ష పార్టీలు పూర్తిగా వామపక్షపాత్రకు పరిమితం కావాల్సిందే. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.