Homeక్రీడలుక్రికెట్‌Lalit Modi On Sanjiv Goenka: లక్నో యజమాని గోయంక అలాంటివాడు.. అందుకే పంత్ వెళ్లిపోయాడు.....

Lalit Modi On Sanjiv Goenka: లక్నో యజమాని గోయంక అలాంటివాడు.. అందుకే పంత్ వెళ్లిపోయాడు.. అసలు నిజం చెప్పిన లలిత్ మోడీ

Lalit Modi On Sanjiv Goenka: ఈ ఐపీఎల్లో అత్యంత దారుణంగా ఆడింది లక్నో జట్టు. ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ముఖ్యంగా లక్నో జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ నడిపించిన విధానం దారుణంగా ఉంది. అందువల్లే ఆ టీం లాస్ట్ స్టేజ్ లో ఉండిపోయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక.. విమర్శలను ఎదుర్కోలేక కెప్టెన్ పంత్ తన స్థానం నుంచి తప్పుకున్నాడు.. అంతేకాదు, ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో లక్నో జట్టుకు నాయకుడిగా ఎవరుంటారో అనే చర్చ మొదలైంది.

ఈ చర్చ ఇలా సాగుతుండగానే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ బాంబు పేల్చారు. సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి.. లక్నో జట్టులో ఏం జరిగిందో బయట పెట్టేశారు. దీంతో స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ మొదలైంది. లక్నో జట్టుకు యజమానిగా సంజీవ్ గోయాంక కొనసాగుతున్నారు. ఆయనను అత్యంత చెత్త యజమాని అని లలిత్ ఆరోపించారు. అతడు మాట తప్పిన మూర్ఖుడు.. నిలకడ లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“అతడు ఒక జట్టును కొనుగోలు చేయడం.. దానిని సమర్థవంతంగా నడిపించడం సాధ్యం కాదు. అనవసరంగా జట్టును కొనుగోలు చేసి తన విఫలత్వాన్ని నిరూపించుకున్నాడు. అతడు లక్నో జటన్ కొనుగోలు చేయడం ద్వారా ఐపిఎల్ రేటింగ్ చాలావరకు తగ్గిపోయింది. లక్నో జట్టు ప్రతి సీజన్లో కూడా దారుణమైన ఆట తీరు కొనసాగిస్తుంది. ఈసారి కూడా లక్నో రిక్త హస్తాలతోనే వెళ్లిపోయింది. గోయంక తీరు వల్ల అతడు ఒక మీమ్ క్రియేటర్లకు సర్ఫ్ గా మారిపోయాడు. అంతేకాదు గోయంక మీద రూపొందిన మీమ్ ను ఎక్కువగా చూసిన వాళ్లకు తాను ఒక చేతి వాచి బహుమతిగా ఇస్తానని” లలిత మోడీ వ్యాఖ్యానించాడు.

సంజీవ్ మీద లలిత్ మోడీ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సందర్భంలో ఆయన ఇదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత సంజీవ్, పంత్ మధ్య విపరీతమైన చర్చ జరిగింది. ఆ సమయంలో సంజీవ్ కు లలిత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ సీజన్లో లక్నో జట్టు అంతగా ఆడక పోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ బాధ్యతల నుంచి పంత్ తప్పుకున్నాడు. సంజీవ్ వ్యవహార శైలి నేపథ్యంలో.. ఇకపై ఆ జట్టుకు సారధిగా ఎవరూ వచ్చే అవకాశం లేదని స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version