Homeజాతీయ వార్తలుUttar Pradesh : ఏమ్మా సంతాన లక్ష్మి.. ఇప్పటికే 24 మందిని కన్నావ్ .. ఇంకా...

Uttar Pradesh : ఏమ్మా సంతాన లక్ష్మి.. ఇప్పటికే 24 మందిని కన్నావ్ .. ఇంకా ఎంతమందిని కంటావు?

Uttar Pradesh : పిల్లలను కనడం నేటి జనరేషన్ లో చాలా ప్రయాసతో కూడుకున్నది. మొదటిది కనేవారు ఇంట్రస్ట్ గా లేకపోవడం.. రెండోది ఉరుకులు, పరుగుల జీవితం. ఇలా చాలా కారణాలతో పిల్లలు పుట్టే రేషియో క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే, ఇది నాణేనికి ఒక వైపు అనుకుంటే రెండో వైపు మరోలా ఉంది. కొందరు సంవత్సరానికి ఒకరిని చొప్పున కంటూనే ఉంటారు. కారణం.. దంపతులు ఆరోగ్యంగా ఉండడం, రోజంతా కష్టపడి పని చేయడం, కాలుష్యం లేని ప్రదేశాలలో జీవించడం, ఇలా చాలా అంశాలు కలిసి వచ్చి పిల్లల జనాభా పెరుగుతుంది. ఇక్కడ ఒక మహిళ 24 మందిని కన్నది. వివాహం జరిగి 23 సంవత్సరాలే అయినా.. 24 మందిని కన్నది. అయితే అందులో 8 సార్లు కవల పిల్లలు పుట్టారు. బాల్య వివాహం ముమ్మాటికి నేరమే. అయినా ఈ సంతాన లక్ష్మి మాత్రం బాల్యంలోనే వివాహం చేసుకొని ఇంత మందికి జన్మనిచ్చింది. 16వ ఏటనే తన మొదటి సంతనంను భూమిపైకి తీసుకువచ్చిందట. తన భర్త డ్రైవర్ గా పని చేస్తున్నాడని, ప్రస్తుతం కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకస్తోంది. ప్రభుత్వం, తాము కూడా కాయ, కష్టంతో కుటుంబం ఇబ్బందులు లేకుండా గడుస్తుందని వివరిస్తోంది. ఇంత మందిని కన్నందుకు ఎలా ఫీలవుతున్నావని ఒక ఛానల్ రెప్రజెంటీవ్ ప్రశ్నించగా గర్వంగా ఫీలవుతున్నామని చెప్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుష్బూ పాఠక్ తన భర్తలో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె మైనర్ గా ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు వివాహం చేశారు. డ్రైవర్ గా పని చేసే తన భర్తతో ఆమె ఆనందంగా జీవిస్తోంది. ఈ సందర్భంలో తన మొదటి సంతానం తనకు 16 సంవత్సరాలు ఉన్న సమయంలో కలిగింది. ఆ తర్వాత అప్పుడప్పుడు 8 సార్లు కవల పిల్లలు పుట్టారు. అంటే 8*2=16 మంది 8 కాన్పుల్లో కలిగారు. ఇక మిగిలిన 8 మంది ఒక్కో కాన్పులో కలిగారు.

మొత్తం 24 మంది పిల్లలతో కుష్బూ పాఠక్ వైరల్ గా మారింది. తక్కువ వయస్సు, అందం ఉన్న ఈ కుష్బూ పాఠక్ ను ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. జనాభాను ఎందుకు పెంచుతున్నావని కొందరు వ్యతిరేకిస్తుండగా.. ఇలానే కనాలి అంటూ మరికొందరు కితాబిస్తున్నారు. ఏది ఏమైనా 24 మంది పిల్లలంటే అంత తేలిక కాదు కదా..

ఇక వారికి ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉన్నా కూడా.. ఇంట్లో మాత్రం నెంబర్ పెట్టి మాత్రమే పిలుస్తారట. తన మొదటి సంతానానికి 23 సంవత్సవాలు ఉంటుందని చెప్తోంది పాఠక్. అంటే ఆమెకు 39 సంవత్సరాలు ఉంటాయని అనుకోవచ్చు. మళ్లీ దేవుడు వరమిస్తే కంటాను అంటుందే తప్ప చాలు అనడం లేదు. అంటే గతంలో మన పెద్ద వారు తిట్లు దీవెనలు ఈమెకు సరిగ్గా పట్టాయేమో కదా.

మన చిన్నతనంలో పెద్ద ‘నీ అమ్మ కడుపు మాడ’ అని తిట్టేవారు. వీళ్ల పిల్లలను కూడా ఇలానే తిట్టినట్టు ఉన్నారు. అందుకే ఆమె కడుపు ఎప్పుడూ పండుతూనే ఉంది. నిజానికి నీ అమ్మ కడుపు మాడ అనేది తిట్టు కాదట.. ఒక దీవెన. ఎలాగంటే ఒక ఆహార పదార్థాన్ని వండుతున్న సందర్భంలో పూర్తిగా ఉడికిన తర్వాత మాడుతుంది. కాబట్టి ఎగ్ రిలీజ్ ఆగేంత వరకు, పూర్తి జీవితంలో సంతానం పొందుతుంది అని అర్థం. ఈ సంతాన లక్ష్మిని అందరూ దీవిస్తున్నారు.

KYA SUCH ME YEH 24 BACCHON KI MAA HAIN 😳|| AAIYE VIDEO DEKHTE HAIN....

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version