టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీగా గత సారి చక్రం తిప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరాడు. ఎంపీగా ఓడిపోయాడు. ప్రస్తుతం తన వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే యోగి శిక్షణ కోసం తమిళనాడు కోయంబత్తూరు వెళ్లాడు.
Also Read: కేసీఆర్ను నమ్మేది లేదు.. ఆయనది వన్ సైడ్ లవ్
నూతన సంవత్సరాన్ని అక్కడే జరుపుకుంటున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ టైపింగ్ లో ఆటో కరెక్టింగ్ ఆప్షన్ కారణంగా పెద్ద తప్పు చేశాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన కొండా.. దానిపై క్యాప్షన్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయబోయి నూతన ‘సమంత’ శుభాకాంక్షలు అని పెట్టేసాడు. ఫోన్ లోని ఆటో కరెక్టింగ్ ఆప్షన్ వల్ల దానంతట అదే మారిపోయిందట..
అయితే దొరక్క దొరక్క మాజీ ఎంపీ కొండా దొరికితే ఊరుకుంటాడా? నెటిజన్లు ఆడేసుకున్నారు. 31వ రాత్రి పార్టీ ఎక్కువైందని.. మందేసి పదాలు దొర్లాయా? అని ఓ నెటిజన్ కొండాను అడగనే అడిగేశాడు.
Also Read: కేసీఆర్ను నమ్మేది లేదు.. ఆయనది వన్ సైడ్ లవ్
అయితే జరిగిన పొరపాటుకు నాలుక కరుచుకున్న కొండా.. అది ఫోన్ టైపింగ్ లోపం వల్ల జరిగిందని.. తాను మందు వేయలేదని.. తన ఫోన్ ను మాత్రం ఆల్కహాల్ శానిటైజర్ తో కోయంబత్తూరు ఎయిర్ పోర్టులో శుభ్రం చేశారని కవర్ చేసుకోవడం గమనార్హం. మొత్తానికి నూతన ‘సమంత’ శుభాకాంక్షలతో మాజీ ఎంపీ కొండా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్