జగన్‌కు ఇది బూస్టింగ్‌ పాయింటే..: ఇక అదొక్కటే టెన్షన్‌

కరోనాతో అటు దేశం.. ఇటు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు కావడంతో అన్నీ మూతపడి ఖజానా డీలా పడింది. అందులోనూ.. ఏపీ రాష్ట్రం మొదటి నుంచీ ఆర్థిక కష్టాలను చూస్తోంది. కానీ.. ఏపీకి ఊరట కలిగే ఒక వార్త లభించింది. రెవెన్యూ రాబడి గతేడాదికి మించి నమోదైంది. కాగ్‌ లెక్కల ప్రకారం 2020 నవంబరు నెలాఖరుకు రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు రూ.66,708.47 కోట్లుగా కాగ్‌ లెక్కగట్టింది. Also Read: బాబు […]

Written By: Srinivas, Updated On : January 2, 2021 10:46 am
Follow us on


కరోనాతో అటు దేశం.. ఇటు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు కావడంతో అన్నీ మూతపడి ఖజానా డీలా పడింది. అందులోనూ.. ఏపీ రాష్ట్రం మొదటి నుంచీ ఆర్థిక కష్టాలను చూస్తోంది. కానీ.. ఏపీకి ఊరట కలిగే ఒక వార్త లభించింది. రెవెన్యూ రాబడి గతేడాదికి మించి నమోదైంది. కాగ్‌ లెక్కల ప్రకారం 2020 నవంబరు నెలాఖరుకు రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు రూ.66,708.47 కోట్లుగా కాగ్‌ లెక్కగట్టింది.

Also Read: బాబు ఏ మాత్రం మారలేదట.. : గంటల తరబడి అదే సోదీ

2019–-20 ఆర్థిక సంవత్సంలో నవంబర్‌‌లో వసూలైన రెవెన్యూ ఆదాయం రూ.63 వేల కోట్లు. అప్పటి బడ్జెట్‌ అంచనాల్లో అది కేవలం 35 శాతం కాగా.. ప్రస్తుత ఏడాది అంచనాల్లో 41 శాతం మేర సాధించారు. రాష్ట్రానికి కేంద్రం సాయంగా ఇచ్చే గ్రాంటుతో పాటు పన్నులు, పన్నేతర రూపాల్లో వచ్చే మొత్తాన్ని రెవెన్యూగా లెక్క కడతారు. ఇందులో జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లోని వాటా, భూమి పన్ను, ఎక్సైజ్‌ ఆదాయం వంటివి కలిపి ఉంటాయి. రుణాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని రెవెన్యూగా పరిగణించరు.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 68 రోజులపాటు లాక్‌డౌన్‌ అమలు చేశారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌ను అంచనాల మేరకు ఖర్చు చేయగలిగితేనే ప్రణాళిక బాగున్నట్లు పరిగణిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 నవంబరు నాటికి రూ.1,40,198.88 కోట్లు ఖర్చు చేశారు. గతేడాదిలో 2019 నవంబరు ఆఖరు నాటికి రూ.93,629.21 కోట్లు వెచ్చించారు. అంటే.. కిందటి ఏడాది కంటే 66 శాతం అధికం. గతేడాది బడ్జెట్‌ అంచనాల్లో నవంబరు నాటికి 44 శాతం ఖర్చు చేయగా.. ఈ ఏడాది మాత్రం దాదాపు 67 శాతంగా నమోదైంది. 2020 నవంబరు నాటికి పెట్టుబడి వ్యయం రూపంలో రూ.15,564.94 కోట్లు ఖర్చు చేశారు. 2019లో ఇదే కాలానికి పెట్టుబడి వ్యయం రూ.4,737.50 కోట్లు మాత్రమే.

Also Read: గంటా శ్రీనివాస్ కు వైసీపీలో నో ఎంట్రీ వెనుక అతడేనా?

పాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో నవంబర్‌‌ వరకు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రెవెన్యూ వసూళ్ల మొత్తంగానీ, వసూళ్ల శాతాన్నిగానీ పోల్చినా.. 2020–-21లో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు స్థూలంగా అర్థమవుతోంది. అందుకే.. బడ్జెట్‌ అంచనాల మేరకు రెవెన్యూ రాబడిలో పెరుగుదల కన్పిస్తోంది. మరోవైపు.. ప్రభుత్వాన్ని అప్పులు కూడా వేధిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది చేసిన అప్పు కిందటేడాది కంటే రెట్టింపు. 2019 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రూ.34,996.29 కోట్లు రుణం తీసుకోగా 2020 ఏప్రిల్‌-–నవంబర్‌ మధ్య రూ.73,811.85 కోట్లు అప్పు చేసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్