జాతీయ వార్తలుకమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!

కమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!

kcr, congressరెండోసారి ఎంత వేగంగా కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అంతే వేగంగా ఆ పార్టీ ప్రభ తగ్గిపోతుందనే అపవాదును మూటగట్టుకుంది. కార్పొరేట్ కు మేలు చేసేలా మోడీ సర్కార్ సంస్కరణలు ఉంటాయని తొలి ప్రభుత్వంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రెండో ప్రభుత్వంలో పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలను దేశ ప్రజలపై రుద్దుతున్న తీరును ప్రభుత్వాలు, ప్రజలు జీర్ణించుకోవడం లేదు.

ALso Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ ఈసారి భారీ మెజార్టీ ఉండొచ్చు కాక.. కానీ వచ్చేసారి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే దూరమైపోయాయి. అలిగేషన్స్ ఉన్న వైసీపీ పార్టీ లాంటివే ఇప్పుడు అవసరార్థం బీజేపీతో అంటకాగుతున్నాయి. అకాలీదళ్ లాంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని సైతం వ్యవసాయ బిల్లులతో బీజేపీ దూరం చేసుకుంది.

కేంద్రంలో చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామం ఏంటంటే.. జాతీయ రాజకీయాల్లో ఎక్కడ అవసరం పడితే అటు వైపు వెంటనే ఫిఫ్ట్ అయ్యే తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ తాజాగా వ్యవసాయ, విద్యుత్ మీటర్ల బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీతో ఫైట్ కు రెడీ అయ్యారు. అయితే రెడీ కావడమే కాదు.. తాజాగా పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ సహా దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి పార్లమెంట్ నే బకాయిట్ చేశారు. పార్లమెంట్ ముందు కాంగ్రెస్, ప్రతిపక్షాలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు.

దీన్ని బట్టి తమ స్వప్రయోజనాలను పట్టించుకోని బీజేపీ కంటే.. కాంగ్రెస్ తోనే వెళ్లడం బెటర్ అని కేసీఆర్ డీసైడ్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తే కేసీఆర్ కీలకం అవుతారు. అప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పోటీ ఉండదు. ఇలా దేశంలో రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా చూసుకునే ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్

కేంద్రంలో కాంగ్రెస్ తో జట్టుకడితే రాష్ట్రంలోనూ ఆ చెలిమి టీఆర్ఎస్ కు లాభం.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మిత్రపక్షం అవుతుంది. అప్పుడు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండదు. బీజేపీ అంత బలంగా లేదు. దీంతో తెలంగాణలో లైన్ క్లియర్ తోపాటు జాతీయ రాజకీయాలపై పట్టు సాధించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమలానికి దూరంగా కాంగ్రెస్ చేతికి గులాబీలు వెళ్లిపోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

-నరేశ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Oktelugu Epaper
Exit mobile version