
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. ఎన్ 95 మాస్కులు, పి.పి.ఇ కిట్స్ ఇవ్వకుంటే వైద్యం చేయలేమని జూనియర్ స్పష్టం చేశారు.
ఈ సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. ఐసోలేషన్ వార్డు సిబ్బందికి మాత్రమే పీపీఈ కిట్స్ ఇస్తామంటున్న జిల్లా అధికారులు తెలిపారు. అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో విధులకు హాజరయ్యేందుకు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ప్రభుత్వ డాక్టర్లు విధులకు దూరంగా ఉంటున్న సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్ల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ, బీజేపీ, జనసేన తదితర పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. వైద్యులకు అవసరమైన రక్షణ పరికరాలు, మాస్క్ లు అందజేయాలని కోరుతున్నాయి.