ఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ నిశ్శబ్దం.. తనకే ప్రమాదం

CM Jagan: జగన్ నిశ్శబ్దం.. తనకే ప్రమాదం

CM Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. పండుగ అనంతరం ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో జగన్ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తన రాజకీయ మిత్రుడు కేసీఆర్ ఓటమితో ఓ రకమైన అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని నిర్ణయాల విషయంలో భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కనీసం తానేం చేస్తానో? ఎందుకు చేస్తున్నానో? చెప్పేందుకు సైతం భయపడుతున్నారు. విశాఖ నుంచి పాలన విషయంలో సీఎంగా ఆయన చేసిన ప్రకటనలు బుట్ట దాఖలవుతున్నాయి. అంతిమంగా అవి ఆయనకే నష్టం చేకూరుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పాలన రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. కానీ తర్వాత విశాఖ రాజధాని అంటూ వైసీపీ నేతలు బ్లాస్ట్ అయ్యారు. సహజంగానే ఇది రెండు ప్రాంతాల్లో ప్రజలనుఇబ్బంది పెట్టించింది. అలాగని విశాఖలో రాజధాని పెట్టడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించలేదు.అలాగని రాజధాని లో విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమరావతిని పూర్తిగా చంపేశారని అపవాదుని ఎదుర్కొన్నారు. దాదాపు కోస్తా లోని మూడు నాలుగు జిల్లాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

అదిగో విశాఖ నుంచి పాలన పలానా రోజు నుంచి ప్రారంభిస్తామని జగన్ స్వయంగా ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి.కానీ తేదీలు మారుతున్నాయి. రోజులు నెలలు గడుస్తున్నాయి. కానీ సీఎం జగన్ హామీ మాత్రం నెరవేరడం లేదు. కార్యరూపం దాల్చడం లేదు. సహజంగానే ప్రజల్లో ఇ దో వైఫల్య మాటగా మిగిలిపోనుంది. కనీసం విశాఖ వెళ్దామా? లేదా? అని అధికార పార్టీ శ్రేణులకు తెలియడం లేదు. వారంతా ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇప్పుడు విశాఖ వెళ్ళినా.. పంతం నెగ్గించుకునేందుకు మాత్రమేనని… అక్కడి ప్రజలు సైతం ఆహ్వానించారని అధికార పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఉన్నది రెండు నెలల వ్యవధి. ఇప్పుడు వెళ్లిన వర్క్ అవుట్ కాదని ఎక్కువ మంది భావిస్తున్నారు. విశాఖపట్నం విషయంలో సీఎం జగన్ స్వయంకృతాపమని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ పేరు చెప్పి అమరావతి నిర్వీర్యం చేశారు. కనీసం విశాఖ వస్తాం అన్న హామీని కూడా అమలు చేయలేకపోయారు. అటువంటప్పుడు ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మక తప్పిదమని తేల్చి చెబుతున్నాయి. దీనికి మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version