Homeఆంధ్రప్రదేశ్‌కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం.

Mobile Corona Testing
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నిర్వహణలో గొప్ప చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పదకొండు లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించి దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ఇక వెయ్యికి పైగా అంబులెన్సులు అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం చాలా ముందుంది.ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారీగా నిధులు కేటాయిస్తూ జగన్ ప్రజారోగ్యం పట్ల తన చిత్తశుద్ధి చాటుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా ఎంత తీవ్ర కృషి చేసినా వైరస్ అదుపులోకి రావడం లేదు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

కాగా ఈ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 20 మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్లను ప్రారంభించనున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలలో ఈ కరోనా టెస్టింగ్ వాహనాలు చేరుకొని టెస్టులు నిర్వహించనున్నాయి. అత్యాధునిక టెస్టింగ్ పరికరాలతో కూడిన ఈ వాహనాలు ప్రజల వద్దకే పోయి..కరోనా ప్రభావిత ప్రాంతాలలో టెస్టులు నిర్వహిస్తాయీ. కరోనా సోకిన వ్యక్తిని గుర్తించే సరికే, జరగాల్సిన నష్టం జరిగిపోతున్న క్రమమంలో జగన్ ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకే సారి పది మందికి కరోనా టెస్టులు నిర్వహించగలిగిన సామర్ధ్యం ఈ వాహనాలలో పొందుపరిచారు. అలాగే శాంపిల్ సేకరించిన 3-4 గంటల వ్యవధిలో ఫలితాలు తెలిసేలా సాంకేతికత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ ద్వారా చాలా వరకు కరోనాను కట్టడి చేయగలం అని అధికారులు నమ్ముతున్నారు. వీటి సంఖ్య 20 నుండి 50కి పెంచనున్నట్లు సమాచారం అందుతుంది. రెడ్ మరియు కంటైన్మెంట్స్ జోన్స్ లో ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ విరివిగా పరీక్షలు నిర్వహించనున్నాయి.

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

ఇక గడచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 1933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1914కాగా, ఇతర రాష్ట్రాలవారు 18, ఒకరు విదేశాల నుండి వచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో రికార్డు స్థాయిలో 11,53,849 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 నాలుగు గంటల్లో 20మంది మృత్యువాతపడ్డారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వలన మరించిన వారి సంఖ్య 328మందికి చేరింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version