ఆంధ్రప్రదేశ్‌వైసీపీ ఇక అక్కడ ఆశలు వదులుకోవాల్సిందే!

వైసీపీ ఇక అక్కడ ఆశలు వదులుకోవాల్సిందే!

YCPతెలంగాణలో ఇక ఫ్యాన్ గుర్తు కనిపించదు. ఇప్పటికే పలు సంకేతాలు ఇచ్చిన జగన్ పార్టీ మూసివేతకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్టంలో పార్టీ కార్యక్రమాలు లేనట్లేనని భావిస్తున్నారు. వైసీపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో రాష్ర్టంలో పార్టీ ఖాళీ అయినట్లే. ఇన్నాళ్లు ఎంతో కొంత నమ్మకంతో ఉన్న కార్యకర్తలు అధ్యక్షుడి రాజీనామాతో తెలంగాణలో ఇక ప్రాభవం కోల్పోయినట్లేనని తెలుస్తోంది.

పార్టీ గుర్తుతో గెలిచినా..
పార్టీ గుర్తుతో గెలిచిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారు కూడా జగన్ అనుమతితోనే పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణలో పార్టీ తన ప్రభావం చూపదని తెలుసుకున్న జగన్ ఏపీ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఏపీలోనే అధికారం చేజిక్కించుకునేందకు పావులు కదిపారు. చివరికి విజయం సాధించారు. అందుకే తెలంగాణలో వైసీపీ ప్రభావం అంతగా లేకుండా పోయింది. అప్పట్లో వారు గెలిచినా జగన్ ఆసక్తి కనబరచలేదు.

షర్మిల పార్టీ పెట్టినా?
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టినా పెద్ద ప్రభావం చూపించలేదని పలువురు పేర్కొంటున్నారు. షర్మిల పార్టీ పెట్టినా ఇక్కడ అంత ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారు. జగన్ ఆశీస్సులతోనే పార్టీ కార్యకర్తలు షర్మిల పార్టీలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ కూడా తెలంగాణలో అంతగా తన ప్రాభవాన్ని చూపించదనే చెబుతున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించినా అంతలా తన ప్రభంజనం వీయదని తెలుస్తోంది. ఎన్ని చేసినా సీమాంధ్ర అనే పేరుతో సంబోధించి ప్రచారానికే పరిమితం చేస్తారని పలువరు విశ్లేషకులు చెబుతున్నారు.

దుకాణం మూసేందుకే..
తెలంగాణలో వైసీపీ దుకాణం మూసివేసేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న మైత్రి వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ప్రత్యర్థులుగా ఉండలేమని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీని తక్షణమే మూసి వేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ప్రభావం చూపించి క్రితం మెజార్టీని సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే తెలంగాణలో పార్టీని లేకుండా చేసేందకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీ ఎన్నికల్లోనే గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేయాలని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version