spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: ఆ కారణంతోనే ఏపీలో పొత్తులను పక్కన పెట్టిన బిజెపి

AP BJP: ఆ కారణంతోనే ఏపీలో పొత్తులను పక్కన పెట్టిన బిజెపి

AP BJP: ఏపీలో విపక్షాల మధ్య పొత్తు కుదరక పోవడానికి వైసిపి యే కారణమా? జాతీయస్థాయిలో అవసరాలతోనే బిజెపి జాప్యం చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయం కాస్త గందరగోళంగానే ఉంది. తెలుగుదేశంతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఏపీ రాజకీయాల్లో బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈ ఏడాది కీలక సమయం. ఎన్నో ముఖ్యమైన బిల్లులను వరుస పెట్టి ఆమోదించుకోవాలని బిజెపి భావిస్తోంది. మరోవైపు విపక్ష కూటమి రోజురోజుకీ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సైతం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయం లో జాగ్రత్తగా అడుగులు వేయకుంటే అసలుకే మోసం వస్తుందని మోడీ షా ద్వయానికి తెలుసు. అందుకే ఏపీలో పొత్తులను డిఫెన్స్ లో పెడుతూనే.. వైసీపీతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

రాజ్యసభలో వైసిపికి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. బిజెపికి ఈ సంఖ్యాబలం చాలా అవసరం. కీలక బిల్లులు ముందుకు సాగాలంటే వైసిపి మద్దతు అవసరం. దీంతో జాతీయస్థాయిలో వైసిపి అవసరం బిజెపికి అనివార్యంగా మారింది. అందుకే ఏపీలో రాజకీయ ప్రయోజనాల కంటే.. జాతీయస్థాయిలో కలిగే లాభాలే బిజెపికి ముఖ్యం. అందుకే బిజెపి ఏపీలో పొత్తులను పక్కన పెట్టింది. కావాలనే జాప్యం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Oktelugu Epaper
Exit mobile version