Homeజాతీయ వార్తలునిర్మలకు మోడీ గుడ్ బై.. దేశానికి కొత్త ఆర్థికమంత్రి?

నిర్మలకు మోడీ గుడ్ బై.. దేశానికి కొత్త ఆర్థికమంత్రి?

Nirmala-Sitharaman-Modi

పేరుకు.. 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. కానీ ఏమున్నది గర్వకారణం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.. ఇంత భారీ ప్యాకేజీ ప్రకటించినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉట్టి ఉత్తుత్తి ప్యాకేజీ అన్న విమర్శలు వచ్చాయి.మోడీ ప్యాకేజీ గాలి బుడగ అని మేధావులు, మీడియా ఆడిపోసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి మోడీ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను మార్చబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలకి.. కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర కేబినెట్ విస్తరణకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్రమంత్రుల పనితీరుపై సమీక్షించిన మోడీ వారి పురోగతి దాదాపు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. మంత్రివర్గంలో చేరికలు.. తీసివేతలతోపాటు మంత్రివర్గ శాఖల మార్పులు కూడా ఉండవచ్చని వార్తలు వెలువడుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక రంగాన్ని మాత్రం నిలబెట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పైగా దక్షిణాది ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో ప్రాధాన్యత దక్కింది. కానీ ఆర్తిక వ్యవస్థ బలోపేతానికి నిర్మలకు మోడీ గుడ్ బై చెప్పి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.

నిర్మల స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిగా సీనియర్ బ్యాంకర్ , ప్రముఖ ఆర్థిక నిపుణులు కేవీ కామత్ ను తీసుకురాబోతున్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చీఫ్ గా ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకున్న కామత్ వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. ఆయనకే కేంద్ర ఆర్థిక మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మల పేరు గతంలో మారుమోగింది.. పైగా సీనియర్ నాయకురాలు. కానీ ఆమె హయాంలో ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఆర్థికమంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్టు సమాచారం.

కామత్ కు ఆర్థిక నిపుణుడిగా పేరుంది. బ్యాంకింగ్ రంగంలో ఆయన విస్తృత సేవలందించారు. ధీరుబాయ్ అంబానీ మరణం తర్వాత ముఖేష్, అనిల్ అంబానీల ఆస్తుల పంపకాన్ని చేపట్టింది ఇదే కామత్ కావడం విశేషం.

కరోనా-లాక్ డౌన్ తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కామత్ ను కేంద్ర ఆర్తిక మంత్రిగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
-నరేశ్ ఎన్నం

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular