Homeఆంధ్రప్రదేశ్‌కాంగ్రెస్ తరహా రాజకీయాలతో బీజేపీలో కన్నా `ఏకాకి'!

కాంగ్రెస్ తరహా రాజకీయాలతో బీజేపీలో కన్నా `ఏకాకి’!


అధికార పక్షం వైసిపి పాలనపై చేస్తున్న విమర్శలకు గాని, అధికార పక్షానికి చెందిన విజయసాయిరెడ్డి వంటి నాయకులు చేస్తున్న తీవ్రమైన ఆరోపణల విషయంలో గాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సొంత పార్టీలో దాదాపు ఏకాకిగా మిగిలి పోవడానికి ఆయన పార్టీలో చేరినప్పటి నుండి అనుసరిస్తున్న కాంగ్రెస్ తరహా రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో విమర్శల దాడులు జరుగుతున్నా కేంద్ర నాయకత్వం పట్టించుకొనక పోవడం, పైగా ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో రాజకీయ వివాదాలపై దృష్టి సారింపవద్దని హితవు చెప్పడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

బీజేపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని గ్రహించి, బేరమాడి వైసిపిలో చేరడానికి సిద్దమైన సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ రాగానే ఆగిపోవడం, ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆయన పట్ల పార్టీ వర్గాలలో ఒక విధమైన ఏహ్యభావంకు దారితీసింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సహితం పార్టీలో దీర్ఘకాలంగా నెలకొన్న పద్ధతులకు తొలిదకాలిచ్చి, కాంగ్రెస్ తరహాలో తన చుట్టూ కొందరు భజనపరుల బృందంను ఏర్పరచుకొని, వారి చెప్పుచేతలలో వ్యవహరిస్తూ వచ్చారు. బీజేపీలో ఎవ్వరు అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, పార్టీ పెద్దలతో ఉండే కోర్ కమిటీలో చర్చించి, ఏ విషయంపై అయినా ఒక నిర్ణయానికి వచ్చే వరవడి నెలకొంది.

అయితే పలువురు కోరే కమిటీ సభ్యులను అసలు ఏ విషయంలో కూడా సంప్రదించకుండా పట్టించుకొనేవారు కాదు. ఈ విషయమై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు కూడా వ్రాసారు. నిర్ణయాలు తీసుకొకునే సమయంలో తమను ఎందుకు సంప్రదింపలేదని కూడా నిలదీశారు.

అవినీతి అంశాలలో ప్రశ్నించిన నేతలను పక్కన పెట్టి, భజనపరులకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పేవారు.

కాంగ్రెస్ నుండి వచ్చిన కొందరు, బీజేపీలో ఉన్న ఒకరిద్దరు అవకాశవాదులు ఆయన చుట్టూ ఒక బృందంగా చేరింది. వారంతా ఆయనకు `దళారుల’వలే వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

పార్టీలో పదవులకు, గత ఏడాది ఎన్నికల సమయంలో పార్ట్ సీట్లకు వీరే బేరాలు ఆడి నిర్ణయించేవారనే ప్రతీతి నెలకొంది. ఆ పేరుతో వీరు భారీగా డబ్బు వసూలు చేసిన్నట్లు పార్టీ అధిష్టానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.

గుంటూరులో పోటీ చేసిన ఒక నటి తన వద్ద నుండి పార్టీ సీట్ కోసం రూ 15 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులకు పార్టీ నుండి అందజేసిన నిధులలో వీరు కొంత మొత్తం కమీషన్ గా వసూలు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా పార్టీ అధిష్టానం ఇటువంటి ఆరోపణలపై మౌనం వహిస్తూ వచ్చింది.

కీలకమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ఏమాత్రం పట్టు లేని పురందేశ్వరి, సోము వీరాజు, జివిఎల్ నరసింహారావు వంటి వారినే సంప్రదిస్తూ ఉండేవారు. పార్టీ వ్యవహారాల విషయంలో తమను ఎప్పుడు సంప్రదించని కారణంగా ఇప్పుడు ఆయ్నపై ఆరోపణలు వస్తుంటే తాము మౌనంగా ఉంటూ ఉండవలసి వస్తున్నదని చలామంది బిజెపి సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు.

ప్రతి జిల్లాలో ఆ విధంగా ఒకరిద్దరు `దళారులు’ను ఏర్పాటు చేసుకొని, వారు చెప్పిన్నట్లే నడుచుకొనేవారని, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పట్టించుకొనేవారు కాదని విమర్శలు నెలకొన్నాయి.

కన్నాను బిజెపిలోకి తీసుకు రావడంలో, ఆయనను రాష్ట్ర అద్యక్షుడైనా చేయడంలో అండగా ఉంటూ వచ్చిన ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం సహితం ఆయన వ్యవహరించిన తీరు చూసి అసంతృప్తితో ప్రస్తుతం దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version