బీజేపీతోనే జగన్ ప్రయాణమా?

ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికతో ఉంది. జాతీయ స్థాయిలో జగన్ తమన తప్పించి వేరే కూటమిలో చేరే అవకాశం లేదని నమ్ముతోంది. అందుకే వైసీపీ నేతలపై బీజేపీ ఆరోపణలు చేస్తున్నారు. జగన్ కు తాము తప్ప వేరెవరూ దిక్కులేరన్న అభిప్రాయంతో బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే వైసీపీపై దూకుడు పెంచుతోంది. దీంతో వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ాష్ర్ట అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంపై కొంత దూకుడుగానే […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 9:52 am
Follow us on

ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికతో ఉంది. జాతీయ స్థాయిలో జగన్ తమన తప్పించి వేరే కూటమిలో చేరే అవకాశం లేదని నమ్ముతోంది. అందుకే వైసీపీ నేతలపై బీజేపీ ఆరోపణలు చేస్తున్నారు. జగన్ కు తాము తప్ప వేరెవరూ దిక్కులేరన్న అభిప్రాయంతో బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే వైసీపీపై దూకుడు పెంచుతోంది. దీంతో వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీజేపీ ాష్ర్ట అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంపై కొంత దూకుడుగానే ఉండేవారు. అమరావతి రాజధాని, శాసనమండలి రద్దు వంటి అంశాలపై కన్నా వ్యతిరేకించారు. అయితే అప్పట్లో కేంద్ర నాయకత్వమే కన్నా దూకుడుకు కళ్లెం వేసిందని చెబుతారు. ఆయనకు పదవి రెన్యువల్ చేయకపోవడానికి ప్రధాన కారణం వైసీపీ నుంచి వచ్చిన వినతులేనని అప్పట్లో రెండు పార్టీల నుంచి వినిపించాయి.

కన్నా లక్ష్మినారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిధులను కన్నా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కానీ కన్నాకు అండగా ఎవరూ నిలబడలేదు. కానీ సోము వీర్రాజు వచ్చిన తర్వాత జగన్ పై తొలినాళ్లలో కొంత మెతక వైఖరి అవలంబించారు. కానీ ఆలయాలపై దాడుల సంఘటనల నుంచి బీజేపీ మళ్లీ స్పీడ్ పెంచింది. జగన్ ను వెంటాడాలని కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు.

జగన్ తో తమకు అవసరం లేదని, జగన్ కు తమ అవసరమే ఉందని బీజేపీ నాయత్వం భావిస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో కలిసే అవకాశం లేనందున బీజేపీతోనే ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు లేనందున జగన్ కు బీజేపీతోనే స్నేహం చేయాల్సిన పరిస్థితి ఉంది.