Homeజాతీయ వార్తలుIntellectuals Leaving Country: దేశం వీడుతున్న మేధావులు.. కారణం ఇదే!

Intellectuals Leaving Country: దేశం వీడుతున్న మేధావులు.. కారణం ఇదే!

Intellectuals Leaving Nation: భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. పెట్టుబడిదారులకు స్వర్గధామం.. యువ శక్తి గలినిన మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. అయితే ఇక్కడ ఉన్నత చదువులు చదివి మేధావులుగా ఎదిగినవారు దేశాభివృద్ధికి కృషి చేయాల్సి ఉండగా, దేశం వీడిపోతున్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, జేఈఈ ర్యాంకర్లు, ఇన్వెస్టర్లు వంటి మేధావులు విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ వలసలు దేశానికి సుమారు 2 బిలియన్‌ డాలర్ల విలువైన ఐటీ మేధస్సును కోల్పోయేలా చేస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అవినీతి, అధికార జాప్యం(రెడ్‌ టాపిజం), వివక్ష వంటి కారణాలు ఈ వలసలకు దోహదపడుతున్నాయని చెబుతున్నారు. అయితే, రిజర్వేషన్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు భావిస్తుండగా, దేశంలోనే ఉంటూ సొంత మార్గాన్ని అన్వేషించవచ్చని మరికొందరు సూచిస్తున్నారు.

మేధావుల వలసకు కారణాలు
భారతదేశంలో అవినీతి, బ్యూరోక్రాటిక్‌ ఆటంకాలు వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాల సృష్టికి ఆటంకంగా ఉన్నాయి. లైసెన్సులు, అనుమతులు పొందడంలో జాప్యం, అవినీతి వల్ల యువ మేధావులు విదేశాల్లో మెరుగైన వాతావరణం కోసం చూస్తున్నారు. కొందరు వివక్ష, సామాజిక అసమానతలను వలసలకు కారణంగా చూపుతున్నారు. ఉద్యోగ, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్‌ విధానాలు కొంతమంది ప్రతిభావంతులైన వ్యక్తులను నిరుత్సాహపరుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో మెరుగైన వేతనాలు, పరిశోధన సౌకర్యాలు, జీవన నాణ్యత, యువ మేధావులను ఆకర్షిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షల్లో ర్యాంకర్లు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. దేశంలోని పరిమిత అవకాశాలు వారిని విదేశీ విశ్వవిద్యాలయాల వైపు నడిపిస్తున్నాయి. ఈ వలసలు దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. ఈ మేధావులు విదేశాల్లో సృష్టించే ఆవిష్కరణలు, ఆదాయం భారత్‌కు లభించడం లేదు. ప్రతిభావంతులైన వ్యక్తులు విదేశాలకు వెళ్లడం వల్ల దేశంలోని యువతకు ఆదర్శప్రాయమైన నాయకత్వం, స్ఫూర్తి కొరత ఏర్పడుతుంది. ఐటీ, ఇంజినీరింగ్, వైద్య రంగాల్లో ఆవిష్కరణలు తగ్గే ప్రమాదం ఉంది.

Also Read: ఎమ్మెల్యేగారు.. పిచ్చిమాటలెందుకు?

దేశంలోనే అవకాశాల సృష్టి
వలసలను అరికట్టడానికి దేశంలోనే మెరుగైన అవకాశాలను సృష్టించడం కీలకం. కొందరు ‘దేశంలోనే ఉంటూ సొంత మార్గాన్ని అన్వేషించవచ్చు‘ అని సూచిస్తున్నారు. పారదర్శకమైన గవర్నెన్స్, డిజిటల్‌ సేవల ద్వారా బ్యూరోక్రాటిక్‌ ఆటంకాలను తగ్గించవచ్చు. భారత్‌లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఫండింగ్, ఇన్క్యుబేషన్‌ సెంటర్ల ద్వారా యువతకు అవకాశాలు కల్పించవచ్చు. మెరిట్‌ ఆధారిత, నాణ్యమైన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, పరిశోధనకు నిధులు కేటాయించడం. రిజర్వేషన్‌ విధానాలను సమీక్షించి, అవసరమైన చోట సంస్కరణలు చేపట్టడం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular