Indian Railways : ఇండియన్‌ రైల్వే సంచలనం.. 1928లోనే ఏసీ రైలు.. నమ్మశక్యం కానిది…కానీ నమ్మండి

స్వతంత్ర భారత రైలు నెట్‌వర్క్‌ మొత్తం మార్గం పొడవు 68,584 కిమీ (42,616 మైళ్లు), 132,310 కిమీ (82,210 మైళ్లు) కంటే ఎక్కువ ట్రాక్, 8 వేలకన్నా ఎక్కువ స్టేషన్‌లను కలిగి ఉంది. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అత్యంతర రద్దీ నెట్‌వర్క్‌లలో మనది ఒకటి. ఏటా 11 బిలియన్లకుపైగా ప్రయాణీకులను, 1.416 బిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేస్తుంది. ఆగస్టు 2024 నాటికి, అన్ని మార్గాలలో 64,080 కిమీ (39,820 మైళ్లు) కంటే ఎక్కువ 25 కేవీ ఏసీ ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌తో విద్యుదీకరించబడింది. ప్రస్తుతం వందే భారత్‌తో సూపర్‌ఫాస్ట్‌ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Written By: Raj Shekar, Updated On : September 14, 2024 11:38 am

Indian Railways

Follow us on

Indian Railways : మన రైల్వే చరిత్ర ఎంతో ఘనమైనది. మనల్ని సుమారు 200 ఏళ్లు పాలించిన బ్రిటిషర్లే వారి వ్యాపారాల కోసం మన దేశంలో రైలు మార్గాలు నిర్మించారు. అంటే మన దేశంలో రైల్వే వ్యవస్థకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఆర్థిక చరిత్రకారుల అధ్యయనాలు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ నుంచి∙గణనీయమైన ప్రయోజనకరమైన ఆర్థిక ప్రభావాలను గుర్తించాయి. మొదటి రైల్వే బడ్జెట్‌ 1924లో సమర్పించబడింది. ఔద్, రోహిల్‌ఖండ్‌ రైల్వే అదే సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియన్‌ రైల్వే కంపెనీలో విలీనం చేయబడింది . ్ర1925 ఫిబ్రవరిలో మొదటి ఎలక్ట్రిక్‌ రైలు విక్టోరియా టెర్మినస్, కుర్లా మధ్య నడిచింది , తరువాత వీటీ– బాంద్రా విభాగం విద్యుదీకరించబడింది. 1929, ఏప్రిల్‌ 1న గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌ నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలోని పెషావర్, మంగళూరు మధ్య రెండు కోచ్‌లను వేరు చేసి మద్రాస్‌కి మరింత కనెక్ట్‌ చేయడంతో కార్యకలాపాలు ప్రారంభించింది . ఫ్రాంటియర్‌ మెయిల్‌ 1928లో బొంబాయి–పెషావర్‌ మధ్య తన ప్రారంభ పరుగును ప్రారంభించింది. ఇలా ఏటా సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ నూతన మార్గాలు నిర్మించుకుంటూ ఇప్పుడు ప్రపంచంలోనే మన రైల్వే వ్యవస్థ నాలుగో స్థానంలో నిలిచింది.

1928లోనే ఏసీ రైలు..
ఇక మన దేశంలో తొలి ఏసీ రైలు 1928, సెప్టెంబర్‌ 1న ప్రారంభించబడింది. దీని పేరు – పంజాబ్‌ మెయిల్‌. 1934లో, ఈ రైలుకు ఏసీ కోచ్‌లు జోడించబడ్డాయి. దీనికి ఫ్రాంటియర్‌ మెయిల్‌ అని పేరు పెట్టారు. ఆ సమయంలో, రైళ్లను మొదటి, రెండో∙తరగతిగా విభజించారు, బ్రిటిష్‌వారు మాత్రమే మొదటి తరగతిలో ప్రయాణించడానికి అనుమతించబడ్డారు. అందుకే చల్లగా ఉండేందుకు ఏసీ బోగీగా మార్చారు. బ్రిటీష్‌ వారి సౌలభ్యం కోసం ఈ వ్యవస్థను రూపొందించారు, ఇందులో ఏసీకి బదులుగా ఐస్‌ బ్లాక్స్‌ ఉపయోగించబడ్డాయి. వీటిని నేల కింద ఉంచారు.. ఈ రైలు 1928, సెప్టెంబర్‌ 1 ముంబైలోని బల్లార్డ్‌ పీర్‌ స్టేషన్‌ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్‌ మీదుగా పెషావర్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)కి బయలుదేరింది, అయితే మార్చి 1930లో సహరాన్‌పూర్, అంబాలా, అమృత్‌సర్, లాహోర్‌ వరకు పొడిగించారు.

అంత్యంత లగ్జరీ రైలుగా..
ఐస్‌ బ్లాక్స్‌ ఉపయోగించిన బోగీలను తరువాత ఏసీ వ్యవస్థను జోడించారు. ఈ రైలు పేరు ఫ్రాంటియర్‌ మెయిల్, ఇది తరువాత అంటే 1996లో #గోల్డెన్‌–టెంపుల్‌ మెయిల్‌ పేరుతో పనిచేయడం ప్రారంభించింది. బ్రిటీష్‌ కాలం నాటి అత్యంత లగ్జరీ రైళ్లలో ఫ్రాంటియర్‌ మెయిల్‌ ఒకటిగా చెప్పబడింది. ఇంతకుముందు 60 కి.మీ వేగంతో ఆవిరితో నడిచేది, ఇప్పుడు విద్యుత్తుతో… 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (గతంలో విక్టోరియా టెర్మినస్‌), పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ మధ్య నడుస్తోంది. ప్రస్తుతం ఈ రైతు 24 బోగీలతో నడుస్తుంది. ఇందులో ఏసీతోపాటు జనరల్, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాని వన్‌–వే ప్రయాణం 1,930 కిలోమీటర్లు. ఈ రైలు 100 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది.