Homeఅంతర్జాతీయంIndia Vs Pakistan: భారత్‌కు చిక్కిన చైనా క్షిపణి గుట్టు.. పాకిస్థాన్‌కు అమ్మి తప్పు చేసిందా..?

India Vs Pakistan: భారత్‌కు చిక్కిన చైనా క్షిపణి గుట్టు.. పాకిస్థాన్‌కు అమ్మి తప్పు చేసిందా..?

India Vs Pakistan: పాకిస్థాన్‌ వైమానిక దళం భారత లక్ష్యాలపై దాడి చేయడానికి చైనా తయారీ PL–15 దీర్ఘశ్రేణి గగనతల క్షిపణిని మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించినట్లు ధ్రువీకరించింది. ఈ నెల 7న భారత్‌ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, పాకిస్థాన్‌ తన J–10, JF–17, F–16 యుద్ధవిమానాలను రంగంలోకి దింపి, సరిహద్దుల్లో భారత జెట్‌లపై PL–15 క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణి శకలాలు పంజాబ్‌లోని హోశియార్పూర్‌ సమీపంలో లభ్యమయ్యాయి, ముఖ్యంగా ఒక క్షిపణి దాదాపు చెక్కుచెదరని స్థితిలో భారత భద్రతా దళాలకు దొరికింది. ఈ అస్త్రం బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ (BVR) సామర్థ్యం కలిగిన చైనా అత్యంత అధునాతన క్షిపణుల్లో ఒకటిగా భావిస్తున్నారు.

Also Read: సీజ్‌ఫైర్‌ వద్ద: పాక్ తో ’భారత్‌ యుద్ధమే కావాలి

భారత్‌–పాక్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ ప్రయోగించిన చైనా క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేకపోగా, భారత భూభాగంలో పడ్డాయి. దీంతో భారత సైనికులు వాటిని స్వాధీనం చేసుకుని ఆ క్షపణుల గుట్టు తేల్చే పనిలో పడ్డారు. PL–15 (థండర్‌ బోల్ట్‌–15) చైనా 607 ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ (CASIC) ద్వారా ఉత్పత్తి చేయబడిన రాడార్‌ గైడెడ్‌ దీర్ఘశ్రేణి క్షిపణి. ఈ క్షిపణి యొక్క స్వదేశీ వేరియంట్‌ 200–300 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, పాకిస్థాన్‌కు ఎగుమతి చేసినPL–15E వేరియంట్‌ గరిష్ఠంగా 145 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్‌–పల్స్‌ రాకెట్‌ మోటారు ఉండటం వల్ల ఇది ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో (మ్యాక్‌–5) ప్రయాణిస్తుంది. యాక్టివ్‌ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్‌ అర్రే (AESA) రాడార్‌ సీకర్, టు–వే డేటా లింక్‌ సామర్థ్యాలతో, ఈ క్షిపణి శత్రువు ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ను తట్టుకుని, గగనతలంలో చురుకైన లక్ష్యాలను ఛేదించగలదు. 20–25 కిలోల హై–ఎక్స్‌ప్లోసివ్‌ ఫ్రాగ్మెంటేషన్‌ వార్‌హెడ్‌తో, ఇది రఫేల్, సుఖోయ్‌–30 MKI, AWAC, ట్యాంకర్‌ విమానాల వంటి ఉన్నత విలువైన లక్ష్యాలను ధ్వంసం చేయడానికి రూపొందించబడింది.

భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనం
చెక్కుచెదరని స్థితిలో PL–15 క్షిపణిని స్వాధీనం చేసుకోవడం భారత రక్షణ వ్యవస్థకు అపూర్వమైన అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణి రాడార్‌ సీకర్, చోదక వ్యవస్థ, డేటా లింక్, ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌–మెజర్స్‌ను విశ్లేషించడం ద్వారా, భారత రక్షణ శాస్త్రవేత్తలు చైనా అధునాతన సాంకేతికత గురించి లోతైన అవగాహన పొందవచ్చు. ఇది భారత్‌కు ఈ క్రింది విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

స్వదేశీ క్షిపణుల అభివృద్ధి: అస్త్ర MK3 వంటి బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ క్షిపణులను మరింత ఆధునికీకరించడానికి సహాయపడుతుంది.

ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యాలు: PL–15 జామింగ్‌ నిరోధక సామర్థ్యాలను అధ్యయనం చేసి, భారత యుద్ధవిమానాలను రక్షించడానికి కౌంటర్‌మెజర్స్‌ను మెరుగుపరచవచ్చు.

S-400 వంటి రక్షణ వ్యవస్థల సానపట్టు: ఈ క్షిపణులను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

అంతర్జాతీయ సహకారం: అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ వంటి దేశాలతో ఈ సాంకేతిక వివరాలను పంచుకోవడం ద్వారా సైనిక సహకారాన్ని బలోపేతం చేయవచ్చు.

సీజ్‌ఫైర్‌వెనుక చైనా పాత్ర
పాకిస్థాన్‌ సీజ్‌ఫైర్‌ నిర్ణయం వెనుక IMF రుణం, అమెరికా ఒత్తిడి కీలకంగా ఉన్నాయని అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. IMF ఇటీవల పాకిస్థాన్‌కు 1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఆమోదించింది, ఇది ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి అవసరం. అయితే, ఈ రుణం కోసం సీజ్‌ఫైర్‌ ప్రకటించాలని షరతుగా ఉందని, అమెరికా ఈ ఒత్తిడిని పాకిస్థాన్‌పై చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో, చైనా యొక్క PL–15 క్షిపణుల ఉపయోగం పాకిస్థాన్‌ ఆయుధ ఆధారితతను, చైనా యొక్క వ్యూహాత్మక మద్దతును స్పష్టం చేస్తుంది. అమెరికా తన AIM–260 జాయింట్‌ అడ్వాన్స్‌డ్‌ టాక్టికల్‌ మిసైల్‌ (JATM)ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, భారత్‌ స్వాధీనం చేసుకున్న ్కఔ–15 క్షిపణి సాంకేతిక విశ్లేషణ అమెరికాకు కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular