Homeజాతీయ వార్తలుNotam Issued By India: పొగ పెడుతోన్న భారత్.. పాకిస్తాన్ కు ఊపిరి ఆడడం లేదు

Notam Issued By India: పొగ పెడుతోన్న భారత్.. పాకిస్తాన్ కు ఊపిరి ఆడడం లేదు

Notam Issued By India: దక్షిణాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. భారత్‌ చేపడుతున్న భారీ సైనిక విన్యాసాలు, ముఖ్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 సంకేతాలు పాకిస్తాన్‌ను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్‌ సిందూర్‌ మొదటి దశ హోల్డ్‌లో ఉంది. రెండో దశ ప్రారంభించేలా భారత ఆయుధ పరీక్షలు, సైనిక విన్యాసాలు ఉన్నాయి. దీంతో దాయాది గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.

Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!

నేవీ కొత్త వ్యూహాత్మక కదలికలు..
ఆపరేషన్‌ సిందూర్‌లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ కీలకపాత్ర పోషించారు. ఆసరేషన్‌ సిందూర్‌ 2.0లో ఇప్పుడు నేవీ కీలకపాత్ర పోషించనుంది. భారత నావికాదళం కార్వార్‌ సదరన్‌ నావల్‌ కమాండ్‌ పరిధిలో బలమైన విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. గుజరాత్‌ తీరం దగ్గర కొనసాగబోయే ఈ చర్యల్లో సౌరాష్ట్ర తీరప్రాంతం ప్రధానంగా ఉంటుంది. పాకిస్తాన్‌ సముద్రతీర విస్తీర్ణం పరిమితంగా ఉండటంతో (కరాచీ, పస్ని, గ్వాదర్‌ మాత్రమే ప్రధాన పోర్టులు), నావికాదళం చైతన్యవంతం కావడం ఆ దేశానికి కొత్త ఆందోళనగా మారింది.

వరుస నోట్యామ్‌తో టెన్షన్‌..
భారత ప్రభుత్వం ఇటీవల రెండుసార్లు నోట్యామ్‌లు (నోటీస్‌ టూ ఎయిర్‌ మెన్‌) జారీ చేసింది. వీటి ప్రకారం అక్టోబర్‌ 24–27, అక్టోబర్‌ 25–27 మధ్య నిర్దిష్ట వాయు సముదాయాలు విమాన ప్రయాణాలకు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఇవి ఆయుధ పరీక్షల సమయానికి భద్రతా హెచ్చరికల రూపంలో జారీ చేయబడ్డాయి. పాకిస్తాన్‌ను ఎక్కువగా కలవరపెడుతున్నది అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు ఉండే మూడో నోట్యామ్‌. ఇది గుజరాత్‌ సౌరాష్ట్ర తీరం పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపంగా అమల్లో ఉంటుంది. ఎత్తులో 28 వేల అడుగుల వరకు ప్రభావం చెల్లుబాటు అవుతుంది.

త్రివిధ దళాల సమన్వయంతో..
ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సమన్వయంతో అన్‌ఫీబియస్‌ ఎక్సర్‌సైజ్‌ అమలు చేయబడుతోంది. రాజస్థాన్‌ నుంచి సౌరాష్ట్ర తీరానికి మధ్య నోట్యామ్‌ పరిధి విస్తరించి ఉండటం భౌగోళిక పరంగా అత్యంత వ్యూహాత్మకంగా మారిస్తోంది. సర్‌క్రిక్‌ ప్రాంతం ఈ విన్యాసాల ప్రధాన కేంద్రంగా గుర్తించబడింది. పాకిస్తాన్‌ గతంలో ఇక్కడి నుంచే 2008 ముంబై దాడులకు అనుబంధ ప్రయత్నాలు చేసినందున, ఈ ప్రాంతంలో భారత్‌ దష్టి పెంచింది. రక్షణ మంత్రి ఇప్పటికే పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు.

అంతర్జాతీయ నిఘా సంస్థల దృష్టి..
భారత నోట్యామ్‌ ప్రాంతాలపై అమెరికా, చైనా గూఢచార సంస్థలు కూడా నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి భారత్‌ ఏ పరీక్ష వాయిదా వేయకపోవడం గమనార్హం. త్రివిధ దళాల సమన్వయంతో జరుగుతున్న ఈ ఆపరేషన్‌ దేశ భద్రతా సామర్థ్యాన్ని కొత్తస్థాయికి తీసుకురానుంది.

అంతర్గత పరిస్థితుల ఒత్తిడిలో పాకిస్తాన్‌
ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ ఉద్రిక్తతలతో కుంగిపోతున్న పాకిస్తాన్‌కి ఈ భారత సైనిక కదలికలు కొత్త ఒత్తిడిని తెచ్చాయి. గ్వాదర్‌ వంటి పోర్టుల రక్షణపైనా ఆందోళన పెరిగింది. సర్‌క్రిక్‌ ప్రాంతంలో భారత విన్యాసాలు ఆక్రమణాత్మక చర్యలుగా మారితే, పాకిస్తాన్‌ సైనికంగా ప్రతిస్పందించాలన్న ఒత్తిడి పెరుగుతోంది.

ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 అనేది కేవలం విన్యాసం కాదు, ఇది భారత్‌ సరిహద్దు రక్షణ వ్యూహాల్లో కొత్త దశగా భావించబడుతోంది. సముద్రతీరం నుంచీ భూమి వరకు త్రివిధ దళాల చైతన్యం భారత రక్షణ సామర్థ్యాన్ని బలపరుస్తుండగా, పాకిస్తాన్‌ అంతరంగంలో భయం, అనిశ్చితి పెరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper