Homeజాతీయ వార్తలుPetrol-Diesel Prices: ఎలక్షన్ కోడ్ అమలు.. పెట్రోల్, డీజిల్ తగ్గుతాయకున్న సామాన్యుడి ఆశలు గల్లంతు

Petrol-Diesel Prices: ఎలక్షన్ కోడ్ అమలు.. పెట్రోల్, డీజిల్ తగ్గుతాయకున్న సామాన్యుడి ఆశలు గల్లంతు

Petrol-Diesel Prices : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనుండగా, జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం తరఫున ప్రజలను ఆకర్షించే ప్రకటనలు ఏమీ ఎన్నికలు అయిపోయేంత వరకు చేయకూడదు. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అంతా భావించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందే ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వస్తుందని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదని స్పష్టం అయింది. ప్రస్తుతం ముడి చమురు ధరలు తగ్గిన ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు. ప్రస్తుతం ముడి చమురు ధరలు మరోసారి బ్యారెల్‌కు 75 డాలర్ల దిగువకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4.29 శాతం క్షీణతతో బ్యారెలుకు 74.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(WTI) క్రూడ్ 4.54 శాతం క్షీణతతో బ్యారెల్ కు 70.48డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధరలలో ఈ పతనం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు లభించింది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హిందూస్తాన్ పెట్రోలియం మూడు కంపెనీల షేర్లు మంగళవారం అంటే అక్టోబర్ 15 ట్రేడింగ్ సెషన్‌లో గొప్ప పెరుగుదలను చూశాయి.

పెరిగిన హెచ్ పీసీఎల్, ఐవోసీ షేర్లు
అయితే మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పెరగడం ముడిచమురు ధరల పతనానికి మాత్రమే సంబంధం లేదు. నిజానికి ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడం కూడా షేర్లు పెరగడానికి ప్రధాన కారణం. నివేదికల ప్రకారం, ముడి చమురు ధరలు బాగా తగ్గిన తరువాత, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటరుకు రూ. 10 నుండి 12 వరకు లాభాన్ని పొందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల దృష్ట్యా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఇది జరగలేదు, అందువల్ల ప్రభుత్వ చమురు కంపెనీల షేర్లలో బలమైన పెరుగుదల కనిపించింది. హెచ్‌పీసీఎల్ షేరు 4.68 శాతం లాభంతో రూ.424.80 వద్ద ట్రేడవుతోంది. బీపీసీఎల్ షేర్లు 2.29 శాతం వృద్ధితో రూ.348 వద్ద ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు 1.42 శాతం వృద్ధితో రూ.167.75 వద్ద ఉన్నాయి.

ఎన్నికల కోడ్ అమలు
మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మంగళవారం, 15 అక్టోబర్ 2024న ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిన తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించకముందే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించవచ్చని ఇటీవల వార్తలు వచ్చినప్పుడు.. ఆ తర్వాత మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. అయితే ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి తగ్గింపు లేకపోవడంతో ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి రావడంతో ప్రస్తుతానికి దీనికి తెరపడింది. దీంతో ప్రభుత్వ చమురు కంపెనీల స్టాక్స్‌లో పెరుగుదల కనిపించింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version