రేవంత్ కు పీసీసీ ఇస్తే.. జగ్గారెడ్డి టీఆర్ఎస్ లోకి?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే వెంటనే టీఆర్ఎస్ లో చేరిపోవాలని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ తూర్పు జగ్గారెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదని ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా చేస్తారని దాదాపుగా తేలిపోయింది. ఇదే జరిగితే దీనికి నిరసనగా జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి […]

Written By: NARESH, Updated On : June 23, 2021 4:52 pm
Follow us on

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే వెంటనే టీఆర్ఎస్ లో చేరిపోవాలని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ తూర్పు జగ్గారెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదని ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా చేస్తారని దాదాపుగా తేలిపోయింది. ఇదే జరిగితే దీనికి నిరసనగా జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నారు. పాలక టీఆర్ఎస్‌ పార్టీలో చేరడానికి జగ్గారెడ్డి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల హరీష్ రావు కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సంగారెడ్డికి వచ్చినప్పుడు, జగ్గ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ప్రశంసలను కురిపించారు. జగ్గారెడ్డి ఏకంగా హరీష్ రావుకు శాలువ కప్పి మంత్రి చేస్తున్న పనికి అభినందనలు తెలిపాడు. ఇది ఆశ్చర్యం కలిగించింది.

ఎందుకంటే జగ్గ రెడ్డి గతంలో మంత్రి హరీష్ అంటేనే ఒంటికాలిపై లేచేవాడు. దారుణ విమర్శకులు చేశాడు. అతనితో గతంలో చాలా సార్లు ఢీ అంటే ఢీ అన్నారు. అనేక సందర్భాల్లో జగ్గా రెడ్డి తాను కేసిఆర్‌కు మద్దతు ఇస్తానని, హరీష్‌ రావుకు కాదని స్పష్టం చేశాడు. అయినప్పటికీ, ఇప్పుడు హరీష్ రావును బహిరంగంగా జగ్గారెడ్డి ప్రశంసిస్తున్నాడు. అతనితో కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్‌గా చేస్తే తాను కాంగ్రెస్ నుంచి తప్పుకుంటానని జగ్గారెడ్డి డిసైడ్ అయినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జగ్గా రెడ్డి తన సన్నిహిత శిబిరం అనుచరులతో కాంగ్రెస్‌ను విడిచిపెట్టే అంశంపై ఇప్పటికే చర్చించారని కూడా వర్గాలు చెబుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ సభ్యుడు జగ్గా రెడ్డి. ఆయన కాంగ్రెస్ నుంచి తప్పుకుంటే పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం ఉండదు. జగ్గా రెడ్డి బిజెపితో రాజకీయాలు ప్రారంభించారు. ఆయన ఆలే నరేంద్రకు అనుచరుడు. తర్వాత విజయశాంతితో కలిసి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత జరిగిన పరిణామాలలో ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. విజయశాంతి ఇప్పుడు బీజేపీలో ఉండగా, జగ్గారెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్‌లో ఉన్నారు. మళ్లీ జగ్గారెడ్డి టిఆర్ఎస్‌లో చేరితే ఇక అన్ని పార్టీలను జగ్గారెడ్డి చేరినట్టు అవుతుంది.