Homeఆంధ్రప్రదేశ్‌బాబు వెంట నడిచేది ఎంతమంది?

బాబు వెంట నడిచేది ఎంతమంది?


సీఆర్డీఏ బిల్లు రద్దు.. మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలయుద్ధంగా తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. 48గంటల డెడ్ లైట్ సీఎం జగన్ కు విధించడం ఆసక్తిని రేపుతోంది. ‘దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. ఎన్నికలకు వెళదాం.. అమరావతిపై ప్రజల్లోనే తేల్చుకుందాం..’ అంటూ బాబు తొడగొట్టడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేళ్లు కష్టపడి గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. జగన్ ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఇంకా నాలుగేళ్లు ఆయనకు పదవీకాలం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల్లో తేల్చుకుందాం.. అంటే మాత్రం జగన్ మాత్రం సిద్ధమవుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కిందటి ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23సీట్లు దక్కాయి. ఇందులో నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం జగన్ కు జై కొడుతున్నారు. ఈ లెక్కన టీడీపీలో బాబుతో కలిపి మొత్తంగా 20మంది ఎమ్మెల్యేలు ఉంటారు.

సీఎంగా ఏడాది కాలంలో జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మునుపటి కంటే ఆయన గ్రాఫ్ ఇటీవలే చాలా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు అమరావతి రాజధానిని అడ్డుపెట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వెళుతారా? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎంతవరకు నెగ్గుతుందని ఆ పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బాబు రాజీనామా చేస్తే ఆయన వెంటే నడించేందుకు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీలో రాజీనామాలు చేసేందుకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Also Read: జగన్ భాద్యత వహిస్తాడా ?

తమ నియోజకవర్గాల్లో పరిస్థితి అంచనా వేయకుండా బాబు ఎలా రాజీనామా కోరుతారని మిగితా ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారట. కిందటేడాదే కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిస్తే బాబు ఆవేశానికి తాము బలికావాలా? అంటూ తమ్ముళ్లు వాపోతున్నారట. ఒక్క అమరావతి రాజధాని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు వెళితే మిగతా ప్రాంతాల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని నేతలు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి రానప్పుడు మళ్లీ రాజీనామా చేసి గెలువడం ఎందుకని నైరాశ్యం నేతల్లో కన్పిస్తుంది.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సంక్షేమ పథకాలు అమలును చూపిస్తూ టీడీపీ నేతలను వైసీపీలోకి చేర్చుకుంటోంది. ఇలాంటి సమయంలో బాబు ఎన్నికలకు వెళితే ఆయన కూడా గెలిస్తాడో లేడో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజీనామాల అంశాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా బాబుకు పరీక్ష మారనుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరీ బాబు ఈ పరీక్షలో ఏమేరకు నెగ్గుతారనేది వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper