spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ప్రజారోగ్యంపై పట్టింపేది?

ప్రజారోగ్యంపై పట్టింపేది?

public healthప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు అథోగతి పాలవుతున్నారు. వైద్యమో రామచంద్ర అని అల్లాడుతున్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దీంతో వ్యవస్థ అంతా అతలాకుతలమైపోతోంది. వైద్యం అందక ప్రజలు మరణమే శరణంగా దీనావస్థలో బతుకులీడుస్తున్నారు. ఆక్సిజన్, పడకలు దొరకక ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లాది ప్రజల జీవనగమనం డోలాయమానంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారు? వారి ప్రాణాలకు ఎవరు అండగా నిలుస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ సైతం అంత వేగంగా ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు ఆరోగ్య సేవలందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-ఆసుపత్రుల కొరత
ఆసుపత్రుల కొరత రోగులను వేధిస్తోంది. సరైన స్థాయిలో హాస్పిటళ్లు లేక రోగగ్రస్థులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఆరోగ్యం అందని ద్రాక్షేనా అని మథనపడుతున్నారు. తమ ప్రాణాల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఐదేళ్లకోసారి ఓటు వేసి గెలిపించుకునే నాయకులు కానరాక దుఖాన్ని దిగమింగుతున్నారు.

-ఆక్సిజన్ సమస్య
ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రధాప పాత్ర పోషిస్తోంది. రోగులకు సత్వరమే వైద్య సేవలందించే క్రమంలో ఆక్సిజన్ ముఖ్య భూమిక అవుతోంది. దీంతో ఆక్సిజన్ దొరకని సమస్య ఉత్పన్నమవుతోంది. నిత్యం ఆక్సిజన్ అందక వేలాది రోగాలు తమ ప్రాణాలు విడుస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పాలకులపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

-నిధులేవి?
ప్రజారోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో రూ. కోట్లు కేటాయిస్తున్నా అవి ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే నిధులు సద్వినియోగం కావడం లేదనే విమర్శలున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారిందనే చెప్పవచ్చు. సర్కారు విడుదల చేస్తున్న నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలకు ఎవరు జవాబు చెబుతారో చూడాల్సిందే.

-మారాల్సిన వ్యవస్థ
మన వ్యవస్థ మారాల్సిన అవసరం ఏర్పడింది. రూ. కోట్లు పన్నుల రూపంలో కడుతున్న ప్రజానీకానికి జవాబుదారీ ఎవరు? వారికి రోగమొస్తే చావే శరణ్యం. ఎందుకీ దురవస్థ. ఏమిటీ అవస్థ. పాలకుల్లో మార్పు రానంతవరకు ఇలాగే కొనసాగితే ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు? వారికి అండగా నిలిచేవారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక నాయకుడిపై ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version